NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Modi Tour In Andhra Pradesh: అమరావతిలో మోదీ పర్యటన.. విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Modi Tour In Andhra Pradesh: అమరావతిలో మోదీ పర్యటన.. విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు
    అమరావతిలో మోదీ పర్యటన.. విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు

    Modi Tour In Andhra Pradesh: అమరావతిలో మోదీ పర్యటన.. విజయవాడలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 30, 2025
    09:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 2, 2025న అమరావతికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

    మోదీ పర్యటన నేపథ్యంలో విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయం ప్రకటించింది.

    మే 2న ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయి.

    Details

    ట్రాఫిక్ మళ్లింపులు - అన్ని రకాల వాహనాలకు (భారీ వాహనాలు సహా) సంబంధించిన మార్గాలు

    1. చెన్నై → విశాఖపట్నం / ఇబ్రహీంపట్నం / నందిగామ వైపు చెన్నై నుంచి విశాఖపట్నం లేదా ఇబ్రహీంపట్నం వైపునకు వెళ్లే భారీ వాహనాలను త్రోవగుంట వద్ద నుంచి చీరాల - బాపట్ల - రేపల్లె - అవనిగడ్డ - పామర్రు - గుడివాడ - హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లిస్తారు.

    అదే విధంగా విశాఖపట్నం నుంచి చెన్నైకి వెళ్లే వాహనాలు కూడా ఇదే మార్గంలో ప్రయాణించాలి.

    2. చిలకలూరిపేట → విశాఖపట్నం

    చిలకలూరిపేట నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలను NH-16 మీదుగా పెదనందిపాడు - కాకుమాను - పొన్నూరు - చందోలు - చెరుకుపల్లి - భట్టిప్రోలు - పెనుమూడి బ్రిడ్జ్-అవనిగడ్డ-పామర్రు-గుడివాడ - హనుమాన్ జంక్షన్ మార్గంలో మళ్లించారు.

    Details

    3. చెన్నై → విశాఖపట్నం (బోయపాలెం క్రాస్ మార్గం) 

    బోయపాలెం క్రాస్ వద్ద నుంచి ఉన్నవ గ్రామం - ఏ.బి.పాలెం - వల్లూరు - పాండ్రపాడు - పొన్నూరు - చందోలు - చెరుకుపల్లి - భట్టిప్రోలు - పెనుమూడి బ్రిడ్జ్ - అవనిగడ్డ - పామర్రు - గుడివాడ - హనుమాన్ జంక్షన్ మార్గంలో మళ్లింపు జరగుతుంది.

    4. గుంటూరు → విశాఖపట్నం

    గుంటూరు నుంచి బయలుదేరే వాహనాలను బుడంపాడు క్రాస్ - తెనాలి - వేమూరు - కొల్లూరు - వెల్లటూరు జంక్షన్ - పెనుమూడి బ్రిడ్జ్ - అవనిగడ్డ - పామర్రు - గుడివాడ - హనుమాన్ జంక్షన్ మార్గంలో మళ్లిస్తున్నారు.

    Details

    5. గన్నవరం → హైదరాబాద్

    గన్నవరం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను ఆగిరిపల్లి - శోభనాపురం - గణపవరం - మైలవరం - జి.కొండూరు - ఇబ్రహీంపట్నం మార్గంలో దారి మళ్లించారు.

    6. విశాఖపట్నం ↔ హైదరాబాద్

    విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు హనుమాన్ జంక్షన్ - నూజివీడు - మైలవరం - జి.కొండూరు - ఇబ్రహీంపట్నం మార్గంలో ప్రయాణించాలి. అదే విధంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వచ్చే వాహనాలు కూడా ఇదే మార్గాన్ని అనుసరించాలి.

    Details

    మల్టీ-యాక్సిల్ గూడ్స్ వాహనాలకు ప్రత్యేక ఆదేశాలు 

    చెన్నై → విశాఖపట్నం : చిలకలూరిపేట, ఒంగోలు, నెల్లూరు వద్ద జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేయబడవు. ఈ మార్గంలో నిరోధాలు లేవు. - విశాఖపట్నం → చెన్నై: హనుమాన్ జంక్షన్, పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఈ వాహనాలను నిలిపివేస్తారు.

    రాత్రి 9:00 గంటల తర్వాత మాత్రమే వీటికి రవాణా అనుమతి ఉంటుంది.

    ప్రయాణికులకు సూచన ఈ మార్గాల్లో ట్రాఫిక్ రహితంగా వాహనాలు కదలికకు సహకరించేందుకు ప్రజలు సహకరించాలని ఏపీ డీజీపీ కార్యాలయం విజ్ఞప్తి చేసింది.

    మీరు ఈ మార్గాల్లో ప్రయాణించాలనుకుంటే ముందుగానే మీ రూట్ ప్లాన్ చేసుకోవడం మంచిది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    విజయవాడ వెస్ట్

    తాజా

    PBKS vs DC : పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం ఢిల్లీ క్యాపిటల్స్
    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా

    నరేంద్ర మోదీ

    Pasala Krishna Bharathi: స్వాతంత్య్ర సమరయోధ కుటుంబ వారసురాలు పసల కృష్ణభారతి ఇకలేరు హైదరాబాద్
    PM Modi: రామనవమికి పంబన్ వంతెనను ప్రారంభించనున్న ప్రధానమంత్రి భారతదేశం
    Modi - Muhammad Yunus: మహమ్మద్‌ యూనస్‌కు భారత ప్రధాని మోదీ లేఖ భారతదేశం
    PM Modi: 'వికసిత్ భారత్'లో ఆరెస్సెస్‌ పాత్ర కీలకం: ప్రధాని మోదీ ఇండియా

    విజయవాడ వెస్ట్

    బెజవాడ బెంచ్ సర్కిల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 300 బైకులు దగ్ధం అగ్నిప్రమాదం
    BillBoard: వాహ్ తాజ్‌మహల్ టీ కాదు.. తబలాలో ను ప్రత్యేకత లైఫ్-స్టైల్
    Broken landslides: విజయవాడలో కొండచరియలు విరిగిపడి బాలిక మృతి కొండచరియలు
    Vijayawada: వరదలో చిక్కుకున్న విజయవాడ.. ప్రాంతాల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే..! ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025