National herald Case: గాంధీలకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తునకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా కాంగ్రెస్కు చెందిన రాహుల్ గాంధీ,సోనియా గాంధీకి సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన ₹ 90 కోట్ల విలువైన ఆస్తిని అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తిలో ఢిల్లీ,ముంబైలోని నేషనల్ హెరాల్డ్ హౌస్లు, లక్నోలోని నెహ్రూ భవన్ ఉన్నాయి. అసోసియేటెడ్ జర్నల్స్కు చెందిన జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ సుమారుగా 752 కోట్లు అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుపై కేంద్ర ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. ఈ విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సామాజిక మాధ్యమం x (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేసింది.
ఈడీ చేసిన ట్వీట్
కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నకేంద్రం: కాంగ్రెస్
ED ద్వారా AJL ఆస్తులను అటాచ్మెంట్ చేయడం ద్వారా ఎన్నికలలో తమ ఓటమి నుండి దృష్టిని మళ్లించాలనే బీజేపీ ఇలా చేస్తోందని అభిషేక్ సింఘ్వీ X లో ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, రాజకీయ కక్షతోనే కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.