NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 20 మందిని గాయపర్చిన మోస్ట్ వాంటెడ్ మంకీ నిర్బంధం.. అటవీశాఖకు రూ.21 వేల రివార్డు
    తదుపరి వార్తా కథనం
    20 మందిని గాయపర్చిన మోస్ట్ వాంటెడ్ మంకీ నిర్బంధం.. అటవీశాఖకు రూ.21 వేల రివార్డు
    మోస్ట్ వాంటెడ్ మంకీ నిర్బంధం

    20 మందిని గాయపర్చిన మోస్ట్ వాంటెడ్ మంకీ నిర్బంధం.. అటవీశాఖకు రూ.21 వేల రివార్డు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 22, 2023
    04:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మోస్ట్‌ వాంటెడ్‌ మంకిగా పేరున్న ఓ కోతిని మధ్యప్రదేశ్ అటవీశాఖకు చెందిన ప్రత్యేక సిబ్బంది ఎట్టకేలకు నిర్బంధించారు.

    సుమారు 20 మందికిపైగా తీవ్రంగా దాడి చేసి గాయపర్చిన కోతి పేరిట రూ.21 వేల రివార్డును స్థానిక మున్సిపాలిటీ ప్రకటించింది.

    మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్‌గఢ్‌ ప్రాంతంలో ఓ కోతి సమీప గ్రామాల్లోని ఇళ్లపై తిరుగుతూ కనిపించిన వారిపై దాడి చేస్తోంది.

    గత 15 రోజుల్లోనే దాదాపుగా 20 మంది ప్రజలు దీని బారిన పడి గాయాలపాలయ్యారు. వీరిలో 8 మంది చిన్నారులు ఉండటం స్థానికులను కలవరపెడుతోంది.

    కోతిని పట్టుకోవడానికి ప్రయత్నించిన స్థానిక పురపాలక సిబ్బంది తర్వాత చేతులెత్తేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ చొరవతో ఉజ్జాయినీ అటవీశాఖకు సమాచారం అందించారు.

    DETAILS

    మత్తు వీడాక బోనులోనే ఆగ్రహంతో ఊగిపోయిన కోతి

    కలెక్టర్ కబురుకు స్పందించిన స్పెషల్ ఆపరేషన్ రెస్క్యూ టీమ్ బుధవారం రాజ్‌గఢ్‌కు చేరుకుంది. ఈ క్రమంలో డ్రోన్‌ సహాయంతో కోతి జాడను తెలుసుకున్నారు.

    అనంతరం దానికి మత్తు మందు సూది ఇచ్చి బోనులో నిర్భంధించారు. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున జై శ్రీరామ్‌, జై భజరంగ్‌ దళ్‌ అంటూ హోరెత్తించారు.

    అయితే కోతికి మత్తు వీడాక బోనులోనే ఆగ్రహంతో ఊగిపోయింది. సదరు బోను నుంచి విడిపించుకునేందుకు గట్టిగా యత్నించింది.

    అయితే జనానికి ప్రమాదకరంగా మారిన సదరు కోతిని దట్టమైన అటవీలో వదిలిపెడతామని రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు.

    ఈ నేపథ్యంలో మోస్ట్‌ వాంటెడ్‌ కోతిపై ఉన్న రూ.21 వేల రివార్డును రెస్క్యూ టీమ్ కే అందిస్తామని మున్సిపల్‌ అధికారులు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    కలెక్టర్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్

    కలెక్టర్

    'జాతీయ సివిల్ సర్వీసెస్ డే 2023'ను ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యతను తెలుసుకోండి  భారతదేశం
    యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు విడుదల; అమ్మాయిలే టాప్, తెలుగు వాళ్లు సత్తా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025