NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Mrityu Koop: సంభాల్ జామా మసీదు సమీపంలో 'డెత్ వెల్' 
    తదుపరి వార్తా కథనం
    Mrityu Koop: సంభాల్ జామా మసీదు సమీపంలో 'డెత్ వెల్' 
    సంభాల్ జామా మసీదు సమీపంలో 'డెత్ వెల్'

    Mrityu Koop: సంభాల్ జామా మసీదు సమీపంలో 'డెత్ వెల్' 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 26, 2024
    02:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో జరుగుతున్న తవ్వకాల్లో ఈ రోజు (గురువారం) మరో అద్భుతం వెలుగుచూసింది.

    జామా మసీదు నుండి 100 మీటర్ల దూరంలో ఒక పురాతన బావి కనుగొనబడింది. ఈ బావి హిందువులు అధికంగా నివసించే ప్రాంతంలో ఉంది.

    దీనిని స్థానికులు "మృత్యు బావి"గా పిలుస్తున్నారు. ఈ బావి సమీపంలోనే ఒక ఆలయం ఉందని, అది మృత్యుంజయ మహాదేవ్ ఆలయం అని స్థానికులు చెబుతున్నారు.

    అయితే, ఈ ఆలయం ప్రస్తుతం పూర్తిగా మట్టిలో కూరుకుపోయి ఉంది. తవ్వకాలు జరిపితే ఈ ఆలయం బయటపడుతుందని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.

    వివరాలు 

    సంభాల్‌ను మతపరమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి

    సంభాల్ ఒకప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రాచుర్యం పొందిన ప్రాంతం. పురాణ కథనాల ప్రకారం, సంభాల్‌లో 84 ప్రదక్షిణ మార్గాలు ఉండేవి, వీటిలో 68 పుణ్యక్షేత్రాలు, 19 ప్రత్యేక బావులు ఉన్నాయని చెబుతారు.

    ప్రతి బావికి ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని విశ్వసిస్తున్నారు.

    ప్రస్తుతం స్థానికులు తవ్వకాల్లో పాల్గొంటూ చారిత్రక ఆధారాలు సేకరిస్తున్నారు.

    సంభాల్‌ను మతపరమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

    ఇటీవల సంభాల్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల కారణంగా ఈ ప్రాంతం వార్తల్లో నిలిచింది.

    ఈ నేపథ్యంలో స్థానిక పరిపాలన అధికారులు తవ్వకాలు ప్రారంభించారు.

    ఆ తవ్వకాల్లో పలు చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద వెలుగుచూస్తున్నాయి.

    వివరాలు 

    సమీపంలోనే యమదగ్ని కుండ్

    ప్రస్తుతం చందౌసిలో కనుగొనబడిన పురాతన మెట్ల బావిని శుభ్రం చేస్తున్నారు.

    తాజా తవ్వకాలలో మృత్యు బావి వెలుగుచూసింది. ఈ బావిలో స్నానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని స్థానికులు విశ్వసిస్తున్నారు.

    ఇక్కడి సమీపంలోనే యమదగ్ని కుండ్ ఉందని కూడా చెబుతున్నారు, దీని కోసం అధ్యయనాలు ప్రారంభమయ్యాయి.

    మృత్యుంజయ దేవాలయం గురించి స్థానికులు ఆసక్తికరమైన సమాచారం చెబుతున్నారు.

    వారి మాటల ప్రకారం,ఈ ఆలయం ఒకప్పుడు చురుకుగా ఉండేదని,ఇప్పుడు దాని కొంత భాగం గోడలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

    ఈ ఆధారాలపై జిల్లా యంత్రాంగం పరిశోధనలను ముందుకు తీసుకువెళుతోంది.

    ప్రస్తుతం మృత్యు బావి తవ్వకాలు కొనసాగుతున్నాయి.అలాగే చందౌసిలో పరిశుభ్రత కార్యక్రమాలు జరుగుతున్నాయి.

    ఈ తవ్వకాల ద్వారా చారిత్రక ప్రాముఖ్యత కలిగిన అనేక వివరాలు వెలుగుచూడనున్నాయని ప్రజలు ఆశిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఉత్తర్‌ప్రదేశ్

    Lucknow: లక్నోలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో  ఐజీ కుమార్తె మృతి  లక్నో
    Operation Bhediya: ఉత్తర్‌ప్రదేశ్'లో కొనసాగుతున్న తోడేళ్ళ భీభత్సం.. అటవీశాఖ పెట్రోలింగ్ ఉన్నప్పటికీ బాలిక మృతి  భారతదేశం
    UP: డబ్బులివ్వలేదని రక్షించలేదు.. నదిలో కొట్టుకుపోయిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరక్టర్  ఇండియా
    Operation Bhediya: బహరాయిచ్‌ లో.. 5 ఏళ్ల బాలికపై  తోడేలు దాడి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025