NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు 
    వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు 
    భారతదేశం

    వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు 

    వ్రాసిన వారు Naveen Stalin
    June 02, 2023 | 11:44 am 1 నిమి చదవండి
    వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు 
    వందేభారత్ వచ్చేస్తోంది! ఇక ముంబై నుంచి గోవాకు 7 గంటల 50 నిమిషాల్లోనే వెళ్లొచ్చు

    ముంబై-గోవా మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును శనివారం ఉదయం 11గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 75 కిలోమీటర్ల స్పీడుతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) నుంచి గోవాలోని మడ్‌గావ్ మధ్య నడిచే ఈ రైలు అత్యంత వేగంగా వెళ్లే ట్రైన్‌గా నిలవనుంది. ముంబై నుంచి గోవాకు కేవలం 7 గంటల 50 నిమిషాల్లో 586 కి.మీ దూరాన్ని ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు పూర్తి చేయనుంది. ఈ రైలు దాదర్, థానే, పన్వెల్, ఖేడ్, రత్నగిరి, కంకవ్లీ, థివిమ్‌లో ఏడు చోట్ల ఆగనుంది. ఆలాగే రోహాలో సాంకేతిక హాల్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ ప్రయాణికులు ఎక్కడం కానీ, దిగడం కానీ ఉండదు.

    గోవాకు మొదటి వందేభారత్ రైలు

    ముంబై-గోవా రైలు అందుబాటులోకి వస్తే దేశంలో వందేభారత్ ట్రైన్ల సంఖ్య 19కి చేరుకుంటుంది. గోవాలో ఇది మొదటి వందేభారత్ రైలు అవుతుంది. ముంబైకి నాల్గవది కాగా, మొత్త మహారాష్ట్రలో 5వది అవుతుంది. ముంబై-గోవా రైలు శుక్రవారం మినహా అన్ని రోజులలో నడుస్తుంది. ఎనిమిది కోచ్‌లతో నడిచే ఈ రైలు సీఎస్ఎంటీ నుంచి ఉదయం 5.25 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.15 గంటలకు మడ్‌గావ్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మడ్గావ్ నుంచి 2.35 గంటలకు బయలుదేరి రాత్రి 10.25 గంటలకు సీఎస్ఎంటీకి చేరుకుంటుంది. ఈ రైలు సెక్షనల్ స్పీడ్ గంటకు 120 కిమీ వరకు ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

    రెండు నెలల్లోనే 16వందేభారత్ రైళ్లు ప్రారంభం

    ముంబై-గోవా మార్గంలో చాలా రద్దీ ఉంటుందని, దీంతో ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేయాల్సి ఉందని రైల్వేశాఖ పేర్కొంది. అయితే ఏసీతో కూడా ఈ వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే రద్దీ తగ్గడానికి దోహదపడుతుందని అభిప్రాయపడింది. గోవా ఒక పర్యాటక ప్రదేశం అయితే ముంబై వాణిజ్య కేంద్రంగా ఉందని, కీలకమైన రెండు ప్రాంతాల ప్రత్యేక రైళ్లను నడపాడలన్న డిమాండ్ చాలా ఉందని రైల్వే శాఖ చెప్పుకొచ్చింది. అయితే ఈ రైలు ద్వారా ఆ డిమాండ్ నెరవేర్చినట్లు అయ్యిందిని పేర్కొంది. ఈ రెండు నెలల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా 16రైళ్లను రైల్వే మంత్రిత్వశాఖ ప్రారంభించడం గమనార్హం.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    ముంబై
    గోవా
    తాజా వార్తలు

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    త్వరలోనే సికింద్రాబాద్- నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ పరుగులు నాగపూర్
    17వ తేదీ నుంచి 16కోచ్‌లతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ పరుగులు; టైమింగ్స్ కూడా మార్పు  జి.కిషన్ రెడ్డి
    సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కోచ్‌ల పెంపుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ తిరుపతి

    ముంబై

    26/11 దాడుల నిందితుడు తహవుర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా కోర్టు గ్రీన్ సిగ్నల్  అమెరికా
    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా  భారతదేశం
     2025 నాటికి దేశంలో 10,000 కి.మీల 'డిజిటల్ హైవే' అభివృద్ధి: హైవే అథారిటీ  టెక్నాలజీ
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్

    గోవా

    పీఎఫ్‌ఐ విచారణ: బిహార్, యూపీ, పంజాబ్, గోవాలో ఎన్‌ఐఏ దాడులు ఎన్ఐఏ
    షాకింగ్ న్యూస్: గోవాలో పర్యాటక కుటుంబంపై కత్తులతో దాడి; సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్ దిల్లీ
    TVS MotoSoul 2023లో రోనిన్ మోటార్‌సైకిళ్ల ప్రదర్శన ఆటో మొబైల్
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి మహారాష్ట్ర

    తాజా వార్తలు

    Delhi: సాక్షిని హత్య చేసేందుకు సాహిల్ ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు దిల్లీ
    రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం  రెజ్లింగ్
    భారత్- నేపాల్ మధ్య బంధాన్ని హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తాం: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్; మరో డీఏని ప్రకటించిన యాజమాన్యం  టీఎస్ఆర్టీసీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023