NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నిండు వేసవిలో గేట్లు తెరుచుకున్న మూసీ.. 25 ఏళ్లలో ఇదే తొలిసారి
    తదుపరి వార్తా కథనం
    నిండు వేసవిలో గేట్లు తెరుచుకున్న మూసీ.. 25 ఏళ్లలో ఇదే తొలిసారి
    మూసీ పరివాహక వాసులకు హై అలెర్ట్

    నిండు వేసవిలో గేట్లు తెరుచుకున్న మూసీ.. 25 ఏళ్లలో ఇదే తొలిసారి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 06, 2023
    12:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సాగు తాగు నీటికి తెలంగాణకే మణిహారమైన నాగార్జున సాగర్‌ నల్గొండ జిల్లాలో ఉంది. అయితే ఈ ప్రాజెక్టు తర్వాత జిల్లాలోనే రెండో అతిపెద్ద ప్రాజెక్టుగా మూసీ రిజర్వాయర్‌ క గుర్తింపు పొందింది.

    ప్రస్తుతం మూసీలో నీటి నిల్వ పూర్తి స్థాయిలో ఉండటంతో సోమవారం అధికారులు డ్యామ్‌ మూడో నంబర్ క్రస్ట్‌ గేట్‌ ద్వారా నీటిని దిగువకు వదిలారు.

    నిండు వేసవిలోనూ మూసీ గరిష్ఠ స్థాయిలో నిండటం రెండున్నర దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. మూసీలో సోమవారం 644.60 అడుగుల మేర నీటి నిల్వలుండగా, పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులుగా అధికారులు తెలిపారు.

    add

    రైతులు, మత్స్యకారులు, పశువుల కాపర్లకు అలెర్ట్ : ప్రాజెక్ట్ ఈఈ

    ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువవడంతో ప్రాజెక్టు డీఈఈ చంద్రశేఖర్‌ మూడో నెంబర్ క్రస్ట్‌ గేట్‌ను అరడుగు మేర తెరిచారు.

    డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలుగా ఉండగా, సోమవారం సాయంత్రానికల్లా 4.36 టీఎంసీల నీటి లభ్యత అందుబాటులో ఉండటం గమనార్హం.

    గంగపుత్రులకు అలెర్ట్ :

    ఓ వైపు ఎగువ నుంచి 300 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా, మరోవైపు అంతే మొత్తం నీటిని దిగువ మూసీలోకి రిలీజ్ చేస్తున్నారు.

    ఈ మేరకు మూసీ పరివాహకంలో రైతులు, మత్స్యకారులు అలెర్ట్ గా ఉండాలని నీటిపారుదలశాఖ ఈఈ డి.భద్రు సూచించారు.

    సూర్యాపేట, పెన్‌పహాడ్‌, కేతేపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో రైతులు తమ పశువులను వదిలిపెట్టొద్దని, మూసీ వాగు వెంట మోటార్లను భద్రపరుచుకోవాలని కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    తెలంగాణ

    హైదరాబాద్‌లో మరో గ్లోబల్ కంపెనీ పెట్టుబడులు; 10వేల మందికి ఉద్యోగాలు  హైదరాబాద్
    విద్యుదుత్పత్తిపై సింగరేణి ఫోకస్; ఇక లాభాలే లాభాలు! విద్యుత్
    హైదరాబాద్: కుక్క నుంచి తప్పించుకోవడానికి 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్  హైదరాబాద్
    అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌లో జోక్యం చేసుకోలేం: సుప్రీంకోర్టు కడప
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025