LOADING...
Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వింత జ్వరం వ్యాప్తి.. అల్మోరా, హరిద్వార్‌లలో 15 రోజుల్లో 10 మంది మృతి
అల్మోరా, హరిద్వార్‌లలో 15 రోజుల్లో 10 మంది మృతి

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వింత జ్వరం వ్యాప్తి.. అల్మోరా, హరిద్వార్‌లలో 15 రోజుల్లో 10 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2025
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లోని రెండు జిల్లాల్లో ఆకస్మికంగా వ్యాపించిన రహస్యవ్యాధి ఆందోళన కలిగిస్తోంది. గత పక్షం రోజులుగా ఈ వ్యాధితో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలు ఆల్మోరా జిల్లా ధౌలాదేవి మండలంలో, హరిద్వార్ జిల్లా రూర్కీ ప్రాంతంలో నమోదయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా (TOI) కథనం ప్రకారం, గత పదిహేనురోజుల్లో ఆల్మోరా జిల్లా ధౌలాదేవి మండలంలో ఏడుగురు మృతి చెందగా.. హరిద్వార్ జిల్లాలోని రూర్కీ ప్రాంతంలో ముగ్గురు మరణించారు.

వివరాలు 

జ్వరంతో పాటు ప్లేట్‌లెట్ తగ్గిపోవడం 

బాధితుల్లో ఎక్కువమంది అధిక జ్వరంతో పాటు ప్లేట్‌లెట్ సంఖ్య తీవ్రంగా తగ్గిపోవడం కనిపించింది. ఈ లక్షణాలు సాధారణంగా డెంగ్యూ వంటి వైరల్ వ్యాధుల్లో కనిపిస్తాయి. దీంతో గ్రామస్థుల్లో "డెంగ్యూ వ్యాప్తి మొదలైందేమో?" అన్న భయాందోళన నెలకొంది. అయితే వైద్యాధికారులు దీనిపై స్పష్టతనిస్తూ, "ల్యాబ్‌ రిపోర్టులు వచ్చాకే అసలు కారణం తెలిసుతుంది" అని తెలిపారు.

వివరాలు 

"ఇంకా కారణం తెలియలేదు": జిల్లా వైద్యాధికారి 

ఆల్మోరా జిల్లా చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నవీన్‌ చంద్ర తివారీ మాట్లాడుతూ, "సాంపిల్స్‌ అన్నీ ఆల్మోరా మెడికల్‌ కాలేజీకి పంపించాం. రిపోర్టులు వచ్చిన తర్వాతే వ్యాధి కారణం స్పష్టమవుతుంది" అని చెప్పారు. "ఏడు మరణాల్లో మూడింటికి వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణమై ఉండవచ్చు. మిగిలినవి వయస్సుతో సంబంధిత అనారోగ్యాల వల్లే జరిగి ఉండొచ్చు" అని తెలిపారు. పోస్టుమార్టం చేయకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి స్థానికులు విచారణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. "ఏడుగురు మృతి చెందినా కానీ ఒక్క పోస్టుమార్టం కూడా చేయలేదు. అలా అయితే అసలు కారణం ఎలా తెలుస్తుంది?" అని ధౌలాదేవి ప్రాంతానికి చెందిన దినేష్‌ భట్‌ ప్రశ్నించారు.

వివరాలు 

సాధారణ సీజనల్‌ వైరల్‌ జ్వరమే..

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆరోగ్య శాఖ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి ఆర్. రాజేష్‌ కుమార్‌ మాట్లాడుతూ, "ధౌలాదేవి ప్రాంతంలో కఠిన పర్యవేక్షణ కొనసాగుతోంది. మరణాలపై శాస్త్రీయ విచారణ కూడా జరుగుతోంది" అని చెప్పారు. రాష్ట్ర ఆరోగ్య అధికారులు పెద్దఎత్తున వ్యాధి వ్యాప్తి ఉందనే వదంతులను ఖండించారు. "ఇది 'మిస్టరీ ఫీవర్‌' గానీ, 'డెంగ్యూ' గానీ కాదు. ఇది సాధారణ సీజనల్‌ వైరల్‌ జ్వరమే. వాతావరణం చల్లబడేకొద్దీ కేసులు తగ్గిపోతాయి" అని ఒక అధికారి తెలిపారు.