NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress:'మన్మోహన్ సింగ్ పేరు పెట్టండి': సావర్కర్ కళాశాల ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
    తదుపరి వార్తా కథనం
    Congress:'మన్మోహన్ సింగ్ పేరు పెట్టండి': సావర్కర్ కళాశాల ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
    'మన్మోహన్ సింగ్ పేరు పెట్టండి': సావర్కర్ కళాశాల ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

    Congress:'మన్మోహన్ సింగ్ పేరు పెట్టండి': సావర్కర్ కళాశాల ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 03, 2025
    12:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీలో హౌసింగ్, విద్యా రంగం సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.

    ఇందులో భాగంగా, నజాఫ్‌గఢ్‌లో రూ.140 కోట్లతో నిర్మించనున్న వీర్‌సావర్కర్‌ కళాశాలకి శంకుస్థాపన చేయడానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

    అయితే, ఈ కార్యక్రమం నేపథ్యంలో బీజేపీ,కాంగ్రెస్‌ నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధం మొదలైంది.

    కాంగ్రెస్‌ నేతలు, వీర్ సావర్కర్ బ్రిటీష్‌ అధికారుల పట్ల క్షమాపణలు చెప్పి, వారికీ పింఛన్లు పొందినట్లు ఆరోపిస్తూ, అలాంటి వ్యక్తి పేరును కళాశాలకు పెట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు.

    వివరాలు 

    బీజేపీపై విమర్శలు చేసిన రాజ్యసభ ఎంపీ హుస్సేన్,

    ఎన్‌ఎస్‌యూఐ నేతలు, దేశంలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు కృషి చేసిన దివంగత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేరుతో ఈ కళాశాల పేరు పెట్టాలని ప్రధాని మోదీకి లేఖ రాశారు.

    వారు, మన్మోహన్‌ సింగ్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు, ఆయన ఆర్థిక సంస్కరణలకు గుర్తుగా ఒక కేంద్ర విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

    అలాగే, రాజ్యసభ ఎంపీ హుస్సేన్,బీజేపీపై తీవ్రమైన విమర్శలు చేసారు.

    ఆయన,బ్రిటీష్‌ వారికి క్షమాభిక్ష పత్రాలు రాసి పింఛన్లు పొందిన వారికి చట్టబద్ధత కల్పిస్తూ, స్వాతంత్ర్య సమర యోధుల సేవలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు.

    ఇదిలా ఉంటే,భాజపా కాంగ్రెస్‌ విమర్శలపై స్పందించింది.దిల్లీ భాజపా చీఫ్‌ వీరేంద్ర సచ్‌దేవా, కాంగ్రెస్‌ అనవసర రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు.

    వివరాలు 

    దిల్లీ అభివృద్ధికి ఇది కీలకమైన రోజు

    కాంగ్రెస్‌ ఎప్పుడూ స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించలేదని ఆయన విమర్శించారు.

    ఈ నేపథ్యంలో, యూనివర్సిటీకి వీర్‌ సావర్కర్‌ పేరు పెట్టడం వైఖరిని భాజపా స్వాగతించింది.

    ప్రధాని మోదీ, దేశ రాజధానిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ, దిల్లీ అభివృద్ధికి ఇది కీలకమైన రోజు అని చెప్పారు.

    విద్యా రంగంలో ప్రారంభించే మౌలిక సదుపాయాల ద్వారా విద్యార్థులకు ప్రపంచ స్థాయి వాతావరణం అందించనున్నట్టు తెలిపారు.

    ఈ ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులు విజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త అవకాశాలను పొందుతారని చెప్పారు.

    దిల్లీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నత విద్యకు పేరుగాంచిన నగరంగా ఎదుగుతూ, త్వరలో దేశ రాజధానిగా ఎడ్యుకేషనల్‌ హబ్‌గా గుర్తింపు పొందనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    కాంగ్రెస్

    Congress: వేదికపైనే కాంగ్రెస్ మహిళా నేతపై వేధింపులు.. పార్టీపై తీవ్ర విమర్శలు (వీడియో) హర్యానా
    MP Son Arrested: రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్‌ ఎంపీ కుమారుడు అరెస్ట్ రోడ్డు ప్రమాదం
    Rahul Gandi: కులగణనకు మద్దతుగా 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలి.. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    Jammu Kashmir Elections: నామినేటెడ్‌ ఎమ్మెల్యే నియామకంపై చర్చ.. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉన్న అధికారాలు ఏవీ? జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025