NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు
    తదుపరి వార్తా కథనం
    ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు
    గర్నరర్‌ను కలిసిన నారా లోకేశ్.. ఏపీలో గంజాయి లభ్యతపై ఫిర్యాదు

    ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 15, 2023
    02:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ లో గంజాయి ఏరులై పారుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన లోకేశ్ డ్రగ్స్‌ను అరికట్టాలని ఫిర్యాదు చేశారు.

    యువగళం పాదయాత్రలో భాగంగా గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో లోకేశ్ భేటీ అయ్యారు.

    గంజాయి సరఫరాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే.

    ఈ క్రమంలో డీఆర్ఐ నివేదికను గవర్నర్‌కు లోకేశ్ అందజేశారు.

    డగ్స్ అక్రమ రవాణాపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. గంజాయి సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

    DETAILS

    దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే: లోకేశ్

    దేశంలో గంజాయి ఏ మూలన దొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్‌తో ముడిపడి ఉంటున్నాయని లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రమేయంతోనే ఏపీ మాదకద్రవ్యాల కేంద్రంగా తయారవుతోందన్నారు.

    గతంలో గంజాయి స్మగ్లింగ్‌లో పట్టుబడిన వారిలో వైసీపీ నేతలే అధికంగా ఉన్నారని లోకేశ్ పెర్కొన్నారు.

    గత 4ఏళ్లుగా యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడుతున్నారని, ఈ మేరకు వారిపై దుష్ఫ్రభావం చూపిస్తుందన్నారు.

    యువగళం పాదయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న లోకేశ్‌కు గంజాయిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి. గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని మహిళలు, యువత ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

    స్పందించిన లోకేశ్ గంజాయికి సంబంధించిన సమాచారాన్ని సీడీ, పెన్‌ డ్రైవ్ లో గవర్నర్‌కు అందజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నారా లోకేశ్
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    నారా లోకేశ్

    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస చంద్రబాబు నాయుడు
    జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు భారతదేశం
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    వర్షాల జడలేక, ప్రాజక్టుల్లో తగ్గుతున్న నీటి నిల్వలు  వర్షాకాలం
    పని చేయకుంటే ఇప్పుడే తప్పుకోవడం మంచిది.. తెదేపా నేతలకు చంద్రబాబు వార్నింగ్ అసెంబ్లీ ఎన్నికలు
    తెదేపా అధినేత చంద్రబాబుకు ఝలక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి కప్పట్రాళ్ల కుటుంబం తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. జై తెలుగు పేరిట ఏర్పాటు చేస్తున్నట్లు జొన్నవిత్తుల ప్రకటన ఎన్నికలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025