NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ
    భారతదేశం

    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ

    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 25, 2023, 01:00 pm 1 నిమి చదవండి
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ
    జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్

    యువ ఓటర్లు భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్ అని, 2000 సంవత్సరం తర్వాత జన్మించిన వారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. మాధ్యమాల ద్వారా యువతను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు కృషి చేస్తున్నట్లు సీఈసీ పేర్కొన్నారు. అలాగే ఓటింగ్ పట్ల ఆసక్తి కనబర్చని పట్టణ ఓటర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చనున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే ప్రతి పోలింగ్ స్టేషన్‌లో మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు, ర్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. పాఠశాలల్లో కల్పించే ఈ సౌకర్యాలు శాశ్వతంగా ఉండేలా ఎన్నికల సంఘం దృష్టి సారిస్తుందని వివరించారు.

    400వ అసెంబ్లీ ఎన్నికల మైలురాయికి అడుగు దూరంలో ఎన్నికల సంఘం

    జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో 2011నుంచి ఇదే రోజున ప్రతిఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది. ఈఏడాది ఎన్నికల సంఘం 13న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించిన థీమ్‌ను కూడా ప్రకటించింది. 'ఓటింగ్‌ను సులభతరం చేయడం, ఖచ్చితంగా ఓటు వేయడం' అనే ఇతివృత్తాన్ని 2023వ సంవత్సరానికి ఎంచుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం ఇప్పటివరకు 17లోక్‌సభ, 16రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించింది. అలాగే అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు జరిగిన 399 శాసనసభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఈసీ, త్వరలో త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో జరగనున్న ఎలక్షన్లతో 400వ అసెంబ్లీ ఎన్నికల మైలురాయికి చేరుకోబోతోంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    భారతదేశం
    అసెంబ్లీ ఎన్నికలు
    లోక్‌సభ
    ఎన్నికల సంఘం

    తాజా

    ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం హైదరాబాద్
    మార్చి 21న లాంచ్ కానున్న కొత్త హ్యుందాయ్ వెర్నా ఆటో మొబైల్
    భారతదేశంలో పోయిన లేదా దొంగిలించిన ఫోన్‌లను కనుగొనడానికి సహాయం చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం
    భారతదేశంలో లాంచ్ అయిన 2023 టయోటా ఇన్నోవా క్రిస్టా ఆటో మొబైల్

    భారతదేశం

    రెండు కీలక ఒప్పందాలపై జపాన్-భారత్ సంతకాలు; ముంబయి-అహ్మదాబాద్ బుల్లెట్ రైలుపై ఒప్పందం జపాన్
    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! దిల్లీ
    లండన్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల వీరంగం; త్రివర్ణ పతాకాన్ని అగౌరవపర్చేందుకు విఫలయత్నం బ్రిటన్
    'ADV' మ్యాక్సీ-స్కూటర్ సిరీస్ ని భారతదేశంలొ ప్రవేశపెట్టనున్న హోండా ఆటో మొబైల్

    అసెంబ్లీ ఎన్నికలు

    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక రాజకీయాల్లో లింగాయత్‌లు ఎందుకంత కీలకం! కర్ణాటక
    కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు; మూడు నెలల్లో రాష్ట్రానికి ఆరోసారి ప్రధాని మోదీ రాక నరేంద్ర మోదీ
    వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచి ఓటు వేయొచ్చు: ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం
    సర్వేలన్నీ బీఆర్ఎస్‌కే అనుకూలం, డిసెంబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు: సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)

    లోక్‌సభ

    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా రాహుల్ గాంధీ
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ రాహుల్ గాంధీ
    ప్రభుత్వాన్ని నియంతలా నడుపుతున్న ప్రధాని మోదీ: కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    వచ్చే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌కు విద్యుత్‌ సవరణ బిల్లు విద్యుత్ శాఖ మంత్రి

    ఎన్నికల సంఘం

    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    అసెంబ్లీ ఎన్నికలు: త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో కౌంటింగ్ ప్రారంభం; ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? అసెంబ్లీ ఎన్నికలు
    మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల బరిలో బీఆర్ఎస్; తొలిసారి తెలంగాణ బయట కేసీఆర్ రాజకీయం భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఆంధ్రప్రదేశ్: 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023