NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ
    తదుపరి వార్తా కథనం
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ
    జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్

    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ

    వ్రాసిన వారు Stalin
    Jan 25, 2023
    01:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యువ ఓటర్లు భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్ అని, 2000 సంవత్సరం తర్వాత జన్మించిన వారు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.

    మాధ్యమాల ద్వారా యువతను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు కృషి చేస్తున్నట్లు సీఈసీ పేర్కొన్నారు. అలాగే ఓటింగ్ పట్ల ఆసక్తి కనబర్చని పట్టణ ఓటర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చనున్నట్లు చెప్పారు.

    ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే ప్రతి పోలింగ్ స్టేషన్‌లో మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీరు, ర్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. పాఠశాలల్లో కల్పించే ఈ సౌకర్యాలు శాశ్వతంగా ఉండేలా ఎన్నికల సంఘం దృష్టి సారిస్తుందని వివరించారు.

    భారత ఎన్నికల సంఘం

    400వ అసెంబ్లీ ఎన్నికల మైలురాయికి అడుగు దూరంలో ఎన్నికల సంఘం

    జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో 2011నుంచి ఇదే రోజున ప్రతిఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎన్నికల సంఘం నిర్వహిస్తోంది.

    ఈఏడాది ఎన్నికల సంఘం 13న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించిన థీమ్‌ను కూడా ప్రకటించింది. 'ఓటింగ్‌ను సులభతరం చేయడం, ఖచ్చితంగా ఓటు వేయడం' అనే ఇతివృత్తాన్ని 2023వ సంవత్సరానికి ఎంచుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

    భారత ఎన్నికల సంఘం ఇప్పటివరకు 17లోక్‌సభ, 16రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించింది. అలాగే అన్ని రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు జరిగిన 399 శాసనసభ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన ఈసీ, త్వరలో త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో జరగనున్న ఎలక్షన్లతో 400వ అసెంబ్లీ ఎన్నికల మైలురాయికి చేరుకోబోతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్నికల సంఘం
    భారతదేశం
    అసెంబ్లీ ఎన్నికలు

    తాజా

    PBKS vs RR: వధేరా-శశాంక్ విధ్వంసం.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం రాజస్థాన్ రాయల్స్
    Liquor Prices: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన ధరలు తెలంగాణ
    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ

    ఎన్నికల సంఘం

    అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌: త్రిపురలో ఫిబ్రవరి 16న, మేఘాలయ, నాగాలాండ్‌లో 27న పోలింగ్ అసెంబ్లీ ఎన్నికలు

    భారతదేశం

    మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన ఇన్ఫోసిస్ లాభం రూ. 6,586కోట్లు వ్యాపారం
    పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా 200 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా సంస్థ వ్యాపారం
    2023 హోండా CB500X vs బెనెల్లీ TRK 502 ఏది మంచిది బైక్
    జనవరి 16న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్

    అసెంబ్లీ ఎన్నికలు

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ అమిత్ షా
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    Election Commission: నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు నేడు షెడ్యూల్‌ విడుదల త్రిపుర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025