NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NCP crisis: పార్టీ గుర్తు ఎక్కడికీ పోలేదు, ప్రజలు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు: శరద్ పవార్ 
    తదుపరి వార్తా కథనం
    NCP crisis: పార్టీ గుర్తు ఎక్కడికీ పోలేదు, ప్రజలు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు: శరద్ పవార్ 
    పార్టీ గుర్తు ఎక్కడికీ పోదు, ప్రజలు, కార్యకర్తలు మాతోనే ఉన్నారు: శరద్ పవార్

    NCP crisis: పార్టీ గుర్తు ఎక్కడికీ పోలేదు, ప్రజలు, కార్యకర్తలు మనతోనే ఉన్నారు: శరద్ పవార్ 

    వ్రాసిన వారు Stalin
    Jul 05, 2023
    08:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. పార్టీ గుర్తును కోసం శరద్ పవార్-అజిత్ పవార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది.

    తాజా పరిణామాలపై అధినేత శరద్ పవార్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వైబి చవాన్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

    ఎన్సీపీ గుర్తు ఎక్కడికి పోదని సీనియర్ పవార్ అన్నారు. తమకు అధికార కాంక్ష లేదని, ప్రజల కోసం పని చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తమను గెలిపించిన ప్రజలు, కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని చెప్పారు.

    శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే‌తో పాటు పార్టీ నేతలు అనిల్ దేశ్‌ముఖ్, బాలాసాహెబ్ పాటిల్, అశోక్ పవార్, జయంత్ పాటిల్, రోహిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.

    ఎన్సీపీ

    అప్పుడు అవినీతిపరులు అని, ఇప్పుడెందుకు పొత్తు పెట్టుకున్నారు: శరద్ పవార్

    వైబి చవాన్‌ ఆడిటోరియంలో జరిగిన సమావేశాన్ని శరద్ పవార్ చారిత్రకమైనది అభివర్ణించారు.

    అజిత్ పవార్ నేతృత్వంలోని బృందం ఎలాంటి విధానాలను అనుసరించలేదని అన్నారు. అజిత్ పవార్‌కు ఏమైనా సమస్యలుంటే తనతో మాట్లాడాల్సిందని శరద్ పవార్ అన్నారు.

    కానీ అవినీతిపరులు అని పిలిచే వారితో అజిత్ పవార్ చేతులు కలిపారంటూ బీజేపీని కూడా దుయ్య బట్టారు.

    ఎన్సీపీ నాయకులను అవినీతి‌పరులు అన్న బీజేపీ, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుందని శరద్ పవార్ ప్రశ్నించారు.

    ఉద్ధవ్ ఠాక్రేకు ఏమి జరిగిందో అదే పునరావృతమైందన్నారు.

    ఈ కష్ట సమయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగాలని శరద్ పవార్ తన మద్దతుదారులు, ఎన్సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

    ఎన్సీపీ

    పార్టీ సింబల్ కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్ వర్గం

    అజిత్ పవార్ ఆదివారం ఏక్ నాథ్ షిండే-బీజేపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరడం వల్ల నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం ఏర్పడింది.

    పవార్‌తో పాటు మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.

    ఎన్సీపీ పార్టీ గుర్తు కోసం అజిత్ పవార్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

    తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శరద్ పవార్ వర్గం ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    శరద్ పవార్ స్పీచ్

    The party symbol is with us, it is not going anywhere. The people and party workers who brought us to power are with us: NCP President Sharad Pawar https://t.co/IppjUVijAz pic.twitter.com/oKsaULDWIv

    — ANI (@ANI) July 5, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శరద్ పవార్
    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    అజిత్ పవార్
    బీజేపీ

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    శరద్ పవార్

    సావర్కర్, అదానీలకు పవార్ మద్దతు; 'హిండెన్‌బర్గ్'పై జేపీసీ అనవసరమని వ్యాఖ్య మహారాష్ట్ర
    అజిత్ పవార్ మళ్లీ ఎన్‌సీపీకి హ్యాండ్ ఇవ్వనున్నారా? బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    శరద్ పవార్ రాజీనామా తిరస్కరణ.. అధ్యక్షుడిగా కొనసాగాలన్న ఎన్సీపీ కమిటీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ

    రాజకీయ పార్టీల విరాళాల్లో 66శాతం అజ్ఞాత వ్యక్తులు ఇచ్చినవే: ఏడీఆర్ నివేదిక బీజేపీ
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    ఏపీలో 'బీఆర్ఎస్‌'కు షాకిచ్చిన ఈసీ; జాతీయ స్థాయిలో 'ఆప్‌'కు ప్రమోషన్  ఎన్నికల సంఘం

    అజిత్ పవార్

    మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జితేంద్ర అవద్; అసలు ఆయన ఎవరో తెలుసా?  మహారాష్ట్ర
    బీజేపీతో పొత్తుపై 2022లోనే ఎన్సీపీలో చర్చ; తిరుగుబాటు నేత ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు  మహారాష్ట్ర
    రసకందాయంలో ఎన్సీపీ వ్యవహారం; నేడు పోటాపోటీగా సమావేశం అవుతున్న శరద్ పవార్, అజిత్ వర్గాలు  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    ఎన్సీపీ గుర్తును దక్కించుకునేందుకు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన అజిత్ పవార్ శరద్ పవార్

    బీజేపీ

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ కాంగ్రెస్
    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ
    బీజేపీలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి చేరికపై ఈటెల ఆసక్తికర కామెంట్స్  ఈటల రాజేందర్
    బీజేపీ ఎంపీ సుజనా చైదరికి కేంద్రం ఝలక్.. మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు ఎంపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025