మహారాష్ట్ర: ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్; డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి కుదుపునకు లోనయ్యాయి. అజిత్ పవార్ మరోసారి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి షాకిచ్చారు. పలువురు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరారు. అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి నుంచి వైదొలగాలని పవార్ తన కోరికను బహిరంగంగా వ్యక్తం చేసిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యుల బృందం ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని అజిత్ పవార్ నివాసంలో సమావేశమైంది.