NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాజస్థాన్: కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య.. ఈ ఏడాది 25వ కేసు
    తదుపరి వార్తా కథనం
    రాజస్థాన్: కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య.. ఈ ఏడాది 25వ కేసు
    రాజస్థాన్: కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య.. ఈ ఏడాది 25వ కేసు

    రాజస్థాన్: కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య.. ఈ ఏడాది 25వ కేసు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 13, 2023
    10:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)కు సిద్ధమవుతున్న 16 ఏళ్ల విద్యార్థిని మంగళవారం రాజస్థాన్‌లోని కోటాలో ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్‌లోని గదిలో ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించింది.

    మృతురాలిని రిచా సిన్హాగా గుర్తించారు. జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన రిచా ప్రస్తుతం కోటలోని విజ్ఞాన్ నగర్‌లోని బ్లేజ్ హాస్టల్‌లో నివసిస్తున్నారు.

    ఈ ఏడాది ఎనిమిది నెలల్లోనే కోటాలో 25 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

    జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE), నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) వంటి పోటీ పరీక్షలకు అర్హత సాధించాలనే ఆశతో ఏటా దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు కోటాకు వస్తారు.

    Details 

    ఈ ఏడాదిలో 25 మంది విద్యార్థుల ఆత్మహత్యలు

    ఈ ఏడాది కోటాలో పోటీ పరీక్షల ఒత్తిడికి సంబంధించి 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారులు నివేదించారు.

    రాజస్థాన్ పోలీసుల సమాచారం ప్రకారం, 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.

    కోవిడ్-19 మహమ్మారి కారణంగా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు మూసివేయడంతో 2020, 2021లో కోటాలో విద్యార్థి ఆత్మహత్యలు నమోదుకాలేదని పోలీసులు తెలిపారు.

    కోటాలో ఆత్మహత్యల పరంపరపై రాజస్థాన్ పోలీసులు స్పందిస్తూ, జిల్లా యంత్రాంగం గతంలో అన్ని హాస్టల్ గదుల్లో స్ప్రింగ్‌లోడెడ్ ఫ్యాన్‌లను తప్పనిసరిగా అమర్చాలని, పేయింగ్ గెస్ట్ వసతిని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.

    Details 

    రాజస్థాన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్  బిల్లును పరిసలిస్తున్న కోర్ట్ 

    ఇది ఇలా ఉండగా, రాష్ట్రంలోని కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో, ముఖ్యంగా కోటాలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు సిఫార్సులు చేయాలని రాజస్థాన్ హైకోర్టు కోరింది.

    పిల్లల మానసిక కౌన్సెలింగ్‌పై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను కోర్టు నొక్కి చెప్పింది.

    కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన రాజస్థాన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ (కంట్రోల్ అండ్ రెగ్యులేషన్) బిల్లు 2023ని ప్రవేశపెట్టడాన్ని పరిశీలిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్

    తాజా

    Hill Sations In AP: సిమ్లా, ముసూరి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్న ఈ హిల్ స్టేషన్లు చాలు! వేసవి కాలం
    CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు  రేవంత్ రెడ్డి
    Jyoti Malhotra: పాక్ ISIతో సంబంధాలపై ఆరోపణలు.. యూట్యూబర్ జ్యోతి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ జ్యోతి మల్హోత్రా
    Ghattamaneni JayaKrishna: ఘట్టమనేని కుటుంబం నూతన హీరోగా జయకృష్ణ అరంగ్రేటం..? మహేష్ బాబు

    రాజస్థాన్

    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం
    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి యుద్ధ విమానాలు
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ అశోక్ గెహ్లాట్
    రాజస్థాన్‌లో రూ.5,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ; ప్రతిపక్షాలపై పరోక్ష విమర్శలు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025