NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపం.. ఎయిర్‌పోర్ట్ తరహా సేవలు 
    తదుపరి వార్తా కథనం
    Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపం.. ఎయిర్‌పోర్ట్ తరహా సేవలు 
    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపం.. ఎయిర్‌పోర్ట్ తరహా సేవలు

    Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కొత్త రూపం.. ఎయిర్‌పోర్ట్ తరహా సేవలు 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 27, 2024
    09:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

    నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ రైల్వే స్టేషన్ నిత్యమూ రద్దీగా ఉంటుంది. లోకల్ ట్రైన్స్ ఎక్కేందుకు వచ్చే హైదరాబాదీలతో ఈ ప్రాంతం మరింత రద్దీగా ఉంటుంది.

    అయితే, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఒక కొత్త రూపం దాల్చనుంది.

    కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 700 కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రారంభించింది. మరో ఏడాదిన్నరలో ఈ పనులు పూర్తియ్యే అవకాశం ఉంది.

    Details

    ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు

    స్టేషన్‌ను ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దడానికి ప్రణాళికలను చేపట్టారు.

    ఆధునీకరణ పూర్తయిన తర్వాత, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా నియంత్రణ వ్యవస్థను అమలు చేయనున్నారు.

    ఇకపై ప్రయాణికులు రైలు ప్లాట్‌ఫామ్‌పైకి ముందుగా వచ్చే అవకాశం లేదు. ప్రయాణికులు వెయిటింగ్ హాల్‌లో ఉండి, రైలు రాక 15 నిమిషాల ముందు మాత్రమే ప్లాట్‌ఫామ్‌ మీదకు రావాల్సి ఉంటుంది.

    లగేజీ స్క్రీనింగ్ కోసం రూ. 6 కోట్ల వ్యయంతో రెండు భారీ లగేజీ స్క్రీనింగ్ మిషిన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఎయిర్ పోర్టులో ఇదే విధానం అమల్లో ఉంది.

    Details

    కొత్త సేవల కోసం ప్రయాణికులు వెయిటింగ్

    ప్రయాణికులు తమ లగేజీని ఈ స్క్రీనింగ్‌లో చెక్ చేయించి, రైలు బయలుదేరే ముందే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తవుతుండటంతో, ప్రయాణికులు కొత్త సేవల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సికింద్రాబాద్
    తెలంగాణ

    తాజా

    MLC Kavitha: కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం కల్వకుంట్ల కవిత
    PM Modi: భారత నారీశక్తిని అడ్డుకున్న ఉగ్రవాదులు మట్టిలో కలిశారు: మోదీ నరేంద్ర మోదీ
    Chiranjeevi : చిరంజీవి-అనీల్ రావిపూడి ప్రాజెక్ట్.. షూటింగ్ పై కీలక అప్డేట్ చిరంజీవి
    Amaravati: అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్ - ఎంవోయూ ర్యాటిఫికేషన్‌తో అధికారిక ఉత్తర్వులు అమరావతి

    సికింద్రాబాద్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    సికింద్రాబాద్‌ డెక్కన్‌ స్పోర్ట్స్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం, ఎగిసిపడుతున్న అగ్నికీలలు హైదరాబాద్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    సికింద్రాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో 200ఏళ్ల నాటి బావి పునరుద్ధరణ దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్

    తెలంగాణ

    Justice Madan Bhim Rao Lokur: పవర్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్ మదన్ భీమ్ రావ్ లోకూర్  భారతదేశం
    Telangana: రెండో విడత పంట రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    CM Revanth Reddy : తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణను మొదటగా అమలు చేస్తాం రేవంత్ రెడ్డి
    మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ లకు గ్రూప్-1 పోస్టులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం మహ్మద్ సిరాజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025