NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు 
    తదుపరి వార్తా కథనం
    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు 
    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు

    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు 

    వ్రాసిన వారు Stalin
    Apr 21, 2023
    01:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    షిర్డీ సాయిబాబా ఆలయ చాలా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఆలయానికి నిత్యం రూ.లక్షల్లో నాణేలు విరళంగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు వాటిని డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి.

    ఆ నాణేలను తమ బ్యాంక్‌ల‌ల్లో పెట్టడానికి స్థలం లేదంటూ అధికారులు వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు.

    దీంతో ఆలయానికి విరాళంగా వచ్చిన నాణేలు గుట్టలు గుట్టులుగా పేరుకుపోతుండటంతో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్ఎస్ఎస్‌టీ) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

    శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌కు 13ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. వాటిలో డజను బ్యాంకులు షిర్డీలోనే ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో ప్రస్తుతం ఎస్ఎస్ఎస్‌టీ డబ్బు కేవలం నాణేల రూపంలోనే దాదాపు రూ.11 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.

    సాయిబాబా

    ఆర్‌బీఐ జోక్యాన్ని కోరుతూ లేఖ రాసే యోచనలో ట్రస్ట్

    స్థలం కొరత కారణంగా షిర్డీలోని నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులు ఇప్పుడు నాణేలను తీసుకోవడం మానేశాయని ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ తెలిపారు. ఇది ట్రస్ట్‌కు పెద్ద సమస్య అని అన్నారు.

    శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌ ఇప్పటివరకు డిపాజిట్ చేసిన నాణేలను ఉంచేందుకే స్థలం లేదని, కొత్త నాణేలను తీసుకొని ఎక్కడ పెట్టాలని బ్యాంకు అధికారులు తమ గోడును చెప్పుకుంటున్నారు.

    ఈ నేపథ్యంలో ట్రస్ట్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జోక్యాన్ని కోరుతూ లేఖ రాసే యోచనలో ఉంది.

    అదే సమయంలో ఇతర బ్యాంకులను కూడా సంప్రదించాలని నిర్ణయించినట్లు రాహుల్ జాదవ్ చెప్పారు.

    నాణేలను డిపాజిట్ చేసుకునే బ్యాంకుల్లో ట్రస్ట్ ఖాతాలను తెరిచేందుకు సిద్ధమవుతున్నట్లు జాదవ్ తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    తాజా వార్తలు
    బ్యాంక్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి రోడ్డు ప్రమాదం
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి గోవా
    Pune: పిల్లలు పుట్టడం లేదని శ్మశానంలో మహిళతో ఎముకలపొడి తినిపించిన అత్తమామలు భారతదేశం

    తాజా వార్తలు

    'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    Happiest State: భారత్‌లోనే అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా? భారతదేశం
    సూపర్‌ సోనిక్ స్పై డ్రోన్‌ను మోహరించేందుకు చైనా కుట్ర: లీకైన యూఎస్ మిలటరీ పత్రాల్లో సంచలన నిజాలు  వాషింగ్టన్ పోస్ట్

    బ్యాంక్

    ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణం కేసు: వేణుగోపాల్ ధూత్‌కు బెయిల్ మంజూరు హైకోర్టు
    ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు ఆస్ట్రేలియా
    మాజీ ఉద్యోగి వేల మంది సిబ్బంది డేటాను దొంగిలించినట్లు ఆరోపించిన Credit Suisse స్విట్జర్లాండ్
    శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025