NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు 
    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు 
    భారతదేశం

    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 21, 2023 | 01:10 pm 0 నిమి చదవండి
    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు 
    షిర్డీ సాయిబాబా ఆలయానికి కొత్త సమస్య; గుట్టలుగా పేరుతున్న నాణేలు; స్థలం లేదంటున్న బ్యాంకులు

    షిర్డీ సాయిబాబా ఆలయ చాలా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఆలయానికి నిత్యం రూ.లక్షల్లో నాణేలు విరళంగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు వాటిని డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. ఆ నాణేలను తమ బ్యాంక్‌ల‌ల్లో పెట్టడానికి స్థలం లేదంటూ అధికారులు వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో ఆలయానికి విరాళంగా వచ్చిన నాణేలు గుట్టలు గుట్టులుగా పేరుకుపోతుండటంతో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్(ఎస్ఎస్ఎస్‌టీ) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌కు 13ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. వాటిలో డజను బ్యాంకులు షిర్డీలోనే ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో ప్రస్తుతం ఎస్ఎస్ఎస్‌టీ డబ్బు కేవలం నాణేల రూపంలోనే దాదాపు రూ.11 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.

    ఆర్‌బీఐ జోక్యాన్ని కోరుతూ లేఖ రాసే యోచనలో ట్రస్ట్

    స్థలం కొరత కారణంగా షిర్డీలోని నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులు ఇప్పుడు నాణేలను తీసుకోవడం మానేశాయని ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ తెలిపారు. ఇది ట్రస్ట్‌కు పెద్ద సమస్య అని అన్నారు. శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌ ఇప్పటివరకు డిపాజిట్ చేసిన నాణేలను ఉంచేందుకే స్థలం లేదని, కొత్త నాణేలను తీసుకొని ఎక్కడ పెట్టాలని బ్యాంకు అధికారులు తమ గోడును చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ట్రస్ట్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జోక్యాన్ని కోరుతూ లేఖ రాసే యోచనలో ఉంది. అదే సమయంలో ఇతర బ్యాంకులను కూడా సంప్రదించాలని నిర్ణయించినట్లు రాహుల్ జాదవ్ చెప్పారు. నాణేలను డిపాజిట్ చేసుకునే బ్యాంకుల్లో ట్రస్ట్ ఖాతాలను తెరిచేందుకు సిద్ధమవుతున్నట్లు జాదవ్ తెలిపారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    షిర్డీ సాయిబాబా
    మహారాష్ట్ర
    తాజా వార్తలు
    బ్యాంక్

    షిర్డీ సాయిబాబా

    మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా? మహారాష్ట్ర

    మహారాష్ట్ర

    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    మహారాష్ట్ర భూషణ్ అవార్డు వేడుకలో విషాదం; వడదెబ్బకు 11మంది మృతి; 120మందికి అస్వస్థత  ఏకనాథ్ షిండే
    కాలువలోకి దూసుకెళ్లిన బస్సు; 12 మంది మృతి  బస్
    నాగ్‌పూర్‌: ఆరేళ్లబాలుడిపై వీధికుక్కల దాడి; వీడియో వైరల్  నాగపూర్

    తాజా వార్తలు

    కేంద్రం కీలక నిర్ణయం: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు చొప్పున ఫుడ్ స్ట్రీట్‌ల ఏర్పాటు  ఆరోగ్యకరమైన ఆహారం
    నెల్లుట్ల సర్పంచ్‌కు జాతీయస్థాయి పురస్కారం; రాష్ట్రపతి భవన్‌లో ప్రసంగం  జనగామ
    సికింద్రాబాద్-తిరుపతి వందే‌భారత్ రైలుకు మంచి ఆదరణ; కోచ్‌లను మరిన్ని పెంచుతున్న రైల్వేశాఖ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్ ఎఫెక్ట్: 'బ్లూ టిక్' కోల్పోయిన దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ట్విట్టర్

    బ్యాంక్

    UPI: 2022లో భారత్‌లో 88బిలియన్ల యూపీఐ లావాదేవీలు; విలువ రూ.150 ట్రిలియన్లు భారతదేశం
    సిలికాన్ వ్యాలీ బ్యాంక్: ఎస్‌వీబీ పతనం భారత క్యాపిటల్ మార్కెట్‌, స్టార్టప్‌లపై ప్రభావమెంత?  అమెరికా
    ICICI-Videocon scam case: కొచ్చర్ దంపతులు, ధూత్‌లపై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ సీబీఐ
    2024 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాను 6.3%కి తగ్గించిన ప్రపంచ బ్యాంక్ ప్రకటన
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023