NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే స్టేషన్.. హైదరాబాద్-తిరుపతి రైలు ప్రయాణం ఇక వేగవంతం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే స్టేషన్.. హైదరాబాద్-తిరుపతి రైలు ప్రయాణం ఇక వేగవంతం
    ఏపీలో కొత్త రైల్వే స్టేషన్.. హైదరాబాద్-తిరుపతి రైలు ప్రయాణం ఇక వేగవంతం

    Andhra Pradesh: ఏపీలో కొత్త రైల్వే స్టేషన్.. హైదరాబాద్-తిరుపతి రైలు ప్రయాణం ఇక వేగవంతం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 10, 2025
    12:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే మార్గం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

    నడికుడి-శ్రీకాళహస్తి రైలు మార్గం (ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లా మీదుగా తిరుపతివైపు) మరికొద్ది నెలల్లోనే పూర్తికానుంది.

    ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నుంచి తిరుపతికి కనెక్టివిటీ మెరుగవ్వడంతో పాటు ప్రయాణదూరం తగ్గనుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఈ రైల్వే లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

    దర్శి, పొదిలి వరకు ట్రాక్ పనులు పూర్తయ్యాయి. స్టేషన్‌ల నిర్మాణం కూడా తుది దశకు చేరుకుంది.

    ఇప్పటికే ఈ మార్గంలో రైళ్ల ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు కనిగిరి వరకు ట్రాక్, రైల్వే స్టేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

    Details

    కనిగిరివాసులకు త్వరలోనే రైలు సౌకర్యం

    కనిగిరి ప్రాంత ప్రజలకు త్వరలోనే రైలు ప్రయాణం సులభతరం కానుంది. కనిగిరి మండలం పోలవరం సమీపంలో రైల్వే స్టేషన్, రెస్ట్రూమ్‌లు పూర్తయ్యాయి.

    స్టేషన్‌లో టికెట్ కౌంటర్లు, ఐరన్ బ్రిడ్జ్‌లు నిర్మాణం పూర్తి అయ్యాయి. పునుగోడుకు వెళ్లే మార్గంలో కూడలి నిర్మాణం పూర్తవ్వగా, కొత్తగా బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతోంది.

    కనిగిరి మండలం పునుగోడు నుంచి పామూరు మండలం తిరగలదిన్నె వరకు 50 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి.

    Details

    రైల్వే లైన్‌తో పరిహారం పంపిణీ 

    ఈ కొత్త రైల్వే మార్గ నిర్మాణం వల్ల భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి రైల్వే శాఖ పరిహారం అందించింది.

    రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కనిగిరి, పామూరు మండలాల్లోని రైతులకు దాదాపు రూ.13 కోట్లు పరిహారంగా చెల్లించారు.

    కనిగిరి ప్రాంతంలో గ్రానైట్ పరిశ్రమ యజమానులతో చర్చలు జరిపి, రైల్వే పనులకు ఎటువంటి ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకున్నారు.

    పేరంగుడిపల్లి వద్ద కొన్ని సమస్యలు ఎదురైనా, వాటిని పరిష్కరించి సంబంధితులకు స్థల కేటాయించారు.

    Details

    హైదరాబాద్ - తిరుపతి ప్రయాణానికి మెరుగైన కనెక్టివిటీ 

    ప్రస్తుతం హైదరాబాద్ నుంచి నడికుడి వరకు రైల్వే మార్గం ఉంది. ఇప్పుడు నడికుడి నుంచి శ్రీకాళహస్తి వరకు కొత్త రైల్వే లైన్ నిర్మాణం కొనసాగుతోంది.

    ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచి తిరుపతికి మరింత త్వరగా వెళ్లే అవకాశం కలుగుతుంది. ఈ రైల్వే మార్గం ప్రయాణికులకు బాగా ఉపయోగపడనుంది.

    రైల్వే అధికారులు వచ్చే నెలలో కరెంట్ లైన్ల పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు.

    ఈ ఏడాదిలోనే కనిగిరి, పామూరు మండలాల్లో రైలు సేవలు ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    తిరుపతి

    తాజా

    IMF: యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు..  పాకిస్థాన్
    Pak drone attacks: 20 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం.. ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: భారత్‌పై పాక్ డ్రోన్ల దాడి.. స్పందించిన డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్
    Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు  భారతదేశం

    ఆంధ్రప్రదేశ్

    AP Mlc Elections: రేపే ఎమ్మెల్సీ ఓటింగ్‌... తప్పులు చేయొద్దు, ఈ జాగ్రత్తలు పాటించండి! ఎమ్మెల్సీ
    Posani Krishna Murali: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు  భారతదేశం
    Special Fund To Farmers: రైతుల కోసం సరికొత్త కార్యాచరణ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం..రూ.100 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు భారతదేశం
    AP News: రాష్ట్రంలో అనధికార,అక్రమ నిర్మాణాలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసిన పురపాలకశాఖ  భారతదేశం

    తిరుపతి

    తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం అగ్నిప్రమాదం
    జనసేన నేతల చెంప చెళ్లుమనిపించిన సీఐ అంజు.. తీవ్ర ఆగ్రహంలో పార్టీ శ్రేణులు  ఆంధ్రప్రదేశ్
    అసెంబ్లీ సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే  వై.ఎస్.జగన్
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025