NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / TTD: ఆలయ పవిత్రత కాపాడేందుకు తిరుమలలో కొత్త నిబంధనలు.. రాజకీయ ప్రసంగాలపై నిషేధం 
    తదుపరి వార్తా కథనం
    TTD: ఆలయ పవిత్రత కాపాడేందుకు తిరుమలలో కొత్త నిబంధనలు.. రాజకీయ ప్రసంగాలపై నిషేధం 
    ఆలయ పవిత్రత కాపాడేందుకు తిరుమలలో కొత్త నిబంధనలు.. రాజకీయ ప్రసంగాలపై నిషేధం

    TTD: ఆలయ పవిత్రత కాపాడేందుకు తిరుమలలో కొత్త నిబంధనలు.. రాజకీయ ప్రసంగాలపై నిషేధం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 30, 2024
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.

    ఆలయ పరిసరాల్లో రాజకీయ ప్రసంగాలు, ద్వేషపూరిత వ్యాఖ్యలను నిషేధిస్తూ ఇటీవల బోర్డు తీర్మానం చేసింది.

    తిరుమలలో దర్శనానికి వచ్చే కొందరు రాజకీయ నాయకులు, మీడియాతో మాట్లాడే సందర్భాల్లో ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాల కంటే రాజకీయ విమర్శలు, వ్యక్తిగత వ్యాఖ్యానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

    ఇది ఆలయ ప్రాంగణంలోని ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం కలిగించే పరిస్థితిని తలెత్తిస్తోంది.

    తాజాగా అమల్లోకి వచ్చిన ఈ నిషేధం ప్రకారం, తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం పూర్తిగా నిషిద్ధం.

    ఎవరు ఈ నిబంధనలను ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.

    Details

    ఆలయ పవిత్రతను కాపాడేందుకు సహకరించాలి

    ఆలయ పరిసరాల్లో పుణ్యక్షేత్రం గౌరవానికి భంగం కలిగే ప్రవర్తనను సహించమని తితిదే అధికారులు హెచ్చరించారు.

    తిరుమల పుణ్యక్షేత్రం లక్షలాది భక్తుల ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ భక్తులు ఆధ్యాత్మిక శాంతిని పొందడానికి వస్తారు.

    అలాంటి ప్రదేశంలో రాజకీయ విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు భక్తుల భావాలకు నష్టం కలిగించే అవకాశముంది. ఈ కారణంగా తితిదే ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.

    తితిదే తీసుకున్న ఈ నిర్ణయాన్ని భక్తులు, రాజకీయ నాయకులు సమర్థించి, ఆలయ పవిత్రతను కాపాడేందుకు సహకరించాలని కోరింది.

    ఈ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పటిష్టంగా ఉంటుందని తితిదే ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి దేవస్థానం
    టీటీడీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్

    టీటీడీ

    టీటీడీ కొత్త ఛైర్మన్ గా జంగా కృష్ణమూర్తి.. పార్టీ విధేయుడి పేరు పరిశీలిస్తున్నసీఎం జగన్ తిరుమల తిరుపతి
    టీటీడీ బోర్డు కొత్త సారథిగా భూమన కరుణాకర్‌ రెడ్డి నియమాకం ఆంధ్రప్రదేశ్
    శ్రీవారి మ్యూజియానికి టీటీడీ భూమి పూజ.. రూ.145 కోట్లతో అత్యాధునిక భవనానికి శ్రీకారం తిరుమల తిరుపతి
    తిరుమల: నడక మార్గంలో భద్రతా ఏర్పాట్లను పెంచిన టీటీడీ  భూమన కరుణాకర్‌ రెడ్డి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025