NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Glass Skywalk Bridge : విశాఖలో కొత్త టూరిజం అట్రాక్షన్.. కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ వంతెన
    తదుపరి వార్తా కథనం
    Glass Skywalk Bridge : విశాఖలో కొత్త టూరిజం అట్రాక్షన్.. కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ వంతెన
    విశాఖలో కొత్త టూరిజం అట్రాక్షన్.. కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ వంతెన

    Glass Skywalk Bridge : విశాఖలో కొత్త టూరిజం అట్రాక్షన్.. కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ వంతెన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 26, 2024
    11:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విశాఖపట్టణం పర్యాటకంలో మరో స్పెషల్ అట్రాక్షన్‌కు నిలయంగా మారనుంది.

    కైలాసగిరి వద్ద ఉన్న టైటానిక్ వ్యూపాయింట్ సమీపంలో భారతదేశపు అతి పొడవైన గ్లాస్ స్కైవాక్ వంతెనను నిర్మిస్తున్నారు.

    రూ. 6 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు, పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ఈ గ్లాస్ స్కైవాక్ 50 మీటర్ల మేర విస్తరించి ఉంటుంది.

    వంతెనపై ఒకేసారి 40 మంది వ్యక్తులు నడిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వంతెనపై నిల్చుని ప్రకృతి సౌందర్యాన్ని తిలకించే వీలు ఉంటుంది.

    ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు థ్రిల్లింగ్ జిప్ లైన్‌లు, స్కై సైక్లింగ్ ట్రాక్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో జిప్ లైన్ ట్రాక్ 150 మీటర్ల మేర విస్తరించి ఉంటుంది.

    Details

    ఆలయాల దర్శనానికి ప్రత్యేక బస్సులు

    ఈ గ్లాస్ వంతెనను విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తోంది.

    ఈ ప్రాజెక్టులో ఆర్జే అడ్వెంచర్స్, ఎస్ఎస్ఎమ్ షిప్పింగ్ లాజిస్టిక్స్, భారత్ మాతా వెంచర్స్ భాగస్వాములుగా ఉన్నారు.

    విశాఖపట్నం నుంచి ఐదు వైష్ణవ ఆలయాల దర్శనానికి ప్రత్యేక బస్సు సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది.

    డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక సర్వీసులు విశాఖ ద్వారకా బస్టేషన్ నుంచి రాత్రి 9 గంటలకు బయలుదేరుతాయి.

    పంచ వైష్ణవ క్షేత్రాలుగా ద్వారకా తిరుమల, అంతర్వేది, అప్పనపల్లి, గొల్లలమామిడాడ, అన్నవరం ఆలయాలను దర్శించేందుకు అవకాశం కల్పిస్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    పర్యాటకం

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    విశాఖపట్టణం

    పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండకు బయల్దేరిన పవన్.. రోడ్లను దిగ్భంధించిన పోలీసులు పవన్ కళ్యాణ్
    కోడికత్తిని అందించింది మంత్రి బొత్స మేనల్లుడే: న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు  బొత్స సత్యనారాయణ
    ముంబై: రన్‌వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు  ముంబై
    AP cabinet decisions: దసరా నుంచే విశాఖ రాజధానిగా పాలన.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే  ఆంధ్రప్రదేశ్

    పర్యాటకం

    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  జీ20 సమావేశం
    ముడుమాల్‌ మెన్హిర్స్‌ కు యునెస్కో గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం ప్రభుత్వం
    ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్తున్నారా? కనతల్ ప్రాంతంలో ఉండే ఈ ప్రదేశాలను ఖచ్చితంగా సందర్శించండి సినిమా
    త్రిపురలో జరిగే 14దేవతల పండగ కర్చీపూజ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు  పండగ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025