Page Loader
Jagan: ఏటుకూరు ఘటనపై కొత్త వీడియో.. జగన్‌ కాన్వాయ్‌ కింద పడి సింగయ్య మృతి?
ఏటుకూరు ఘటనపై కొత్త వీడియో.. జగన్‌ కాన్వాయ్‌ కింద సింగయ్య మృతి?

Jagan: ఏటుకూరు ఘటనపై కొత్త వీడియో.. జగన్‌ కాన్వాయ్‌ కింద పడి సింగయ్య మృతి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 22, 2025
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాలుగు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు పర్యటన సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. జగన్ సత్తెనపల్లి వెళ్తున్న సమయంలో ఏటుకూరు బైపాస్ వద్ద వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు. జగన్ రాకను చూసేందుకు ఏటుకూరు బైపాస్ వద్దకు వచ్చిన సింగయ్యను వాహనం ఢీకొనడంతో ఆయన చనిపోయారు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ప్రకారం, సింగయ్యను ఢీకొట్టింది జగన్ కాన్వాయ్‌లోని వాహనమేనని స్పష్టమవుతోంది. తొలుత పోలీసులు ఒక ప్రైవేటు వాహనం ఢీకొనడంతోనే సింగయ్య చనిపోయాడని ప్రాథమికంగా నిర్ధారించారు.

Details

'అలసిపోయాను.. ప్లీజ్ హెల్ప్ చేయండి' 

ప్రైవేట్ వాహనం ఢీకొనటంతో సింగయ్య రోడ్డుపై పడిపోయారని, ఆ తర్వాత ఆ వాహనం టైరు అతని భుజం మీదుగా వెళ్లినట్టు చెప్పారు. కానీ ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, సింగయ్యపై జగన్ వాహనమే ఎక్కినట్టు తెలిసింది. సింగయ్య జగన్ వాహనం టైరు కింద ఉన్నప్పుడే, అదే వాహనంపై జగన్ నిలబడి అభిమానులకు అభివాదం చేస్తున్నారు. పల్నాడు పర్యటన నేపథ్యంలో జగన్‌ను చూసేందుకు భారీగా ప్రజలు వచ్చారు. ఆ సమయంలో సింగయ్య టైరు కింద చిక్కుకుని, తీవ్రంగా గాయపడ్డాడు.

Details

మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు

చుట్టుపక్కల ఉన్నవారు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతను మృతిచెందినట్టు ధృవీకరించారు. తొలుత పోలీసులు ప్రైవేట్ వాహనమే సింగయ్యను ఢీకొట్టినట్టు తెలిపారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చిన వీడియోలో నిజానికి జగన్ వాహనమే అతనిని ఢీకొన్నట్టు తెలుస్తోంది. సింగయ్య కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కేసు ఇకపై ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

Twitter Post