పీఎల్ఎఫ్ఐ టెర్రర్ ఫండింగ్ కేసు: జార్ఖండ్లో ఎన్ఐఏ సోదాలు; ఆయుధాలు స్వాధీనం
పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ) ఉగ్రదాడులకు నిధులు సమకూర్చిన కేసులో గత రెండు రోజులుగా జార్ఖండ్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్థానిక పోలీసుల సహకారంతో విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో బుధవారం జార్ఖండ్లో మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. మే 21న ఈ కేసులో అరెస్టయిన దినేష్ గోపే ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా జార్ఖండ్లోని ఖుంటి, గుమ్లా, సిమ్డేగా జిల్లాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) ఫుల్వారి షరీఫ్ కేసులో ఎన్ఐఏ బుధవారం కర్ణాటక, కేరళ, బిహార్లలో దాదాపు 25 చోట్ల దాడులు నిర్వహించింది.