NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pahalgam terror attack: దర్యాప్తు కోసం NIA 3D మ్యాపింగ్ టెక్నిక్‌ని ఉపయోగిస్తుంది..అది ఏమిటి?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pahalgam terror attack: దర్యాప్తు కోసం NIA 3D మ్యాపింగ్ టెక్నిక్‌ని ఉపయోగిస్తుంది..అది ఏమిటి?
    దర్యాప్తు కోసం NIA 3D మ్యాపింగ్ టెక్నిక్‌ని ఉపయోగిస్తుంది..అది ఏమిటి?

    Pahalgam terror attack: దర్యాప్తు కోసం NIA 3D మ్యాపింగ్ టెక్నిక్‌ని ఉపయోగిస్తుంది..అది ఏమిటి?

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2025
    05:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగి వారం కంటే ఎక్కువ కాలం గడిచినా, దర్యాప్తు సంస్థలు ఇంకా పెద్దగా విజయం సాధించలేదు.

    నిందితులను పట్టుకునే బాధ్యతను ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించింది. బైసరన్ లోయలోని సంఘటనా స్థలాన్ని NIA బృందం సందర్శించి, ప్రజలను విచారించడం ద్వారా ఆధారాలు సేకరించడానికి ప్రయత్నించింది. సంఘటనా స్థలాన్ని NIA 3D మ్యాపింగ్ కూడా చేసింది.

    NIA 3D మ్యాపింగ్ అంటే ఏంటో తెలుసా?

    3D మ్యాపింగ్ 

    3D మ్యాపింగ్ అంటే ఏమిటి? 

    3D మ్యాపింగ్ అనేది వస్తువులు, ఉపరితలాలు లేదా వాతావరణాల 3D చిత్రాలను సృష్టించే సాంకేతికత. ఇది 2D తో పోలిస్తే లోతైన అవగాహనను అందిస్తుంది. ఏదైనా ప్రదేశం లేదా వస్తువు యొక్క మరింత ఖచ్చితమైన , సమగ్రమైన చిత్రాన్ని అందిస్తుంది.

    సాంకేతిక భాషలో చెప్పాలంటే, ఇది ఒక రకమైన డిజిటల్ మోడల్, ఇది వాస్తవ ప్రపంచంలోని 3 కోణాలను చూపిస్తుంది. వివిధ కెమెరాలు, సెన్సార్లు, సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి డేటాను సంగ్రహించడం ద్వారా ఇది సృష్టించబడుతుంది.

    కారణం 

    పహల్గామ్ దాడిలో 3D మ్యాపింగ్ ఎందుకు చేస్తున్నారు? 

    ఈ ఏజెన్సీలు డ్రోన్‌లను ఉపయోగించి వైమానిక చిత్రాలను సంగ్రహించి, బైసరన్ లోయ 3D నమూనాను రూపొందిస్తాయి. దీనివల్ల దాడి జరిగిన సమయంలో జరిగిన సంఘటనలను అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.

    దీనితో, ఉగ్రవాదులు ఏ వైపు నుండి వచ్చారు, ఏ దిశలో పారిపోయారు,దాడి సమయంలో ఎంత మంది పర్యాటకులు ఎక్కడ ఉన్నారో ఏజెన్సీలు కనుగొంటాయి.

    ఇది ప్రమాదాలను ఖచ్చితత్వంతో అర్థం చేసుకోవడంలో,విశ్లేషించడంలో, కోర్టు చర్యలలో NIAకి సహాయపడుతుంది.

    ప్రకటన 

    3D మ్యాపింగ్ చేసిన NIA బృందం 

    "ఏప్రిల్ 22న బైసారన్‌లో ఉన్న మృతుల కుటుంబ సభ్యులు, పోనీ రైడర్లు, విక్రేతలు, ఇతర కార్మికుల నుండి స్టేట్‌మెంట్‌లను సేకరించడానికి NIA బృందం బుధవారం ఆ ప్రదేశాన్ని సందర్శించింది. ఉపగ్రహ చిత్రాలు, దర్యాప్తు బృందం చిత్రీకరించిన గడ్డి భూముల వీడియో ఫుటేజ్, 3D మ్యాపింగ్ వంటి సాంకేతిక డేటాను సేకరించిందని" పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారిని ఉటంకిస్తూ హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది.

    చర్య 

    NIA ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకుంది? 

    దాడి జరిగినప్పటి నుండి NIA ఇప్పటివరకు 2,500 మందికి పైగా ప్రశ్నించింది. వీరిలో దాదాపు 180 మందిని అదుపులోకి తీసుకున్నారు.

    అదే సమయంలో, జమ్మూ కాశ్మీర్‌లోని హురియత్ కాన్ఫరెన్స్, జమాతే-ఇ-ఇస్లామి వంటి నిషేధిత సంస్థల మద్దతుదారుల ఇళ్లలో కూడా సోదాలు జరిగాయి. కనీసం 10 మంది ఉగ్రవాదుల ఇళ్ళు బాంబులతో పేల్చివేయబడ్డాయి.

    ఏప్రిల్ 22న పహల్గామ్ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్ఐఏ

    తాజా

    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్
    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి

    ఎన్ఐఏ

    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ముంబై
    ఐసీస్ సానుభూతిపరులే టార్గెట్: కేరళ, తమిళనాడు, కర్ణాటకలోని 60 చోట్ల ఎన్ఐఏ దాడులు కర్ణాటక
    గ్యాంగ్‌స్టర్-టెర్రర్ నెట్‌వర్క్‌పై ఎన్‌ఐఏ ఉక్కుపాదం; దేశవ్యాప్తంగా 72చోట్లు దాడులు ఉగ్రవాదులు
    టెర్రర్ ఫండింగ్ కేసు: జమ్ముకశ్మీర్‌లో ఎన్ఐఏ విస్తృత సోదాలు జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025