NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Budget 2025 : 'దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు' గురజాడ పద్యంతో నిర్మలా బడ్జెట్ ప్రారంభం
    తదుపరి వార్తా కథనం
    Budget 2025 : 'దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు' గురజాడ పద్యంతో నిర్మలా బడ్జెట్ ప్రారంభం
    'దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు' గురజాడ పద్యంతో నిర్మలా బడ్జెట్ ప్రారంభం

    Budget 2025 : 'దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు' గురజాడ పద్యంతో నిర్మలా బడ్జెట్ ప్రారంభం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 01, 2025
    12:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 సంవత్సరానికి సంబంధించిన భారతదేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ రోజు ఆమె తన ఎనిమిదో బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

    దీంతో భారతదేశంలో అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఆమె పేరును రికార్డు గ్రంథాలలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి.

    కుంభమేళాలో జరిగిన ఘటనా దుర్ఘటనపై చర్చ జరగాలని వారు పట్టుబట్టారు. అయితే వివక్షాల ఆందోళన మధ్యనయినా నిర్మలమ్మ బడ్జెట్‌ను సభకు సమర్పించారు.

    నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, 'దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు' అని గురజాడ అప్పారావు రాసిన కవితను ఉటంకించారు.

    Details

    బడ్జెట్

    భారతదేశం 'వికసిత భారత్‌' లక్ష్యంతో ముందుకు వెళ్ళిపోతుందని ప్రకటించారు. అలాగే గతంలో చేపట్టిన సంస్కరణలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

    భారత్‌ను అధిక వృద్ధి రేటు సాధిస్తున్న దేశాలలో ఒకటిగా గుర్తించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను 'సున్నా శాతం పేదరికం' లక్ష్యంగా, 'పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్' పేరుతో ప్రవేశపెట్టారని తెలిపారు.

    ఇన్‌ఫ్రా అభివృద్ధి, మధ్య తరగతి ప్రజల వికాసంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.

    ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని, గత 10 సంవత్సరాలలో దేశం సాధించిన వృద్ధి అనేక అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని చెప్పారు.

    సమతుల్య అభివృద్ధి, సమ్మిళిత వృద్ధిని లక్ష్యంగా రాబోయే 5 సంవత్సరాలను ఒక ప్రత్యేక అవకాశంగా భావిస్తున్నట్లు నిర్మలమ్మ స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బడ్జెట్‌ 2025
    నిర్మలా సీతారామన్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    బడ్జెట్‌ 2025

    Budget 2025 : బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభించనుందా? బిజినెస్
    New Income Tax Act: బడ్జెట్ 2025 ఆదాయపు పన్ను చట్టాన్ని కొత్త ప్రత్యక్ష పన్ను కోడ్‌తో భర్తీ చేస్తుందా?   బిజినెస్
    Budget : బడ్జెట్ 2025.. ఆదాయ శ్లాబ్స్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందా?  పన్ను
    Halwa Ceremony: నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ భారతదేశం

    నిర్మలా సీతారామన్

    Interim Budget 2024: ఈ 'మినీ బడ్జెట్‌'లో దేశం ఏం ఆశిస్తోందో తెలుసుకుందాం  బడ్జెట్
    Interim Budget 2024: ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్  బడ్జెట్ 2024
    New housing scheme: మధ్య తరగతికి కేంద్రం గుడ్ న్యూస్.. గ్రామాల్లో 2కోట్ల ఇళ్ల నిర్మాణం  బడ్జెట్ 2024
    కేంద్ర బడ్జెట్ రూ.48 లక్షల కోట్లు.. రక్షణ రంగానికి అత్యధికం.. వ్యవసాయానికి అత్యల్ప కేటాయింపులు బడ్జెట్ 2024
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025