NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Lok Sabha: నేడు లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం 
    తదుపరి వార్తా కథనం
    Lok Sabha: నేడు లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం 
    నేడు లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం

    Lok Sabha: నేడు లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 10, 2025
    10:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది.

    ఇటీవలే ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది.

    ప్రస్తుతం దేశంలో 60 ఏళ్ల కిందటి ఆదాయపు పన్ను చట్టమే అమలులో ఉంది.

    దీని స్థానంలో కొత్త బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నాలు చేపట్టింది.

    శనివారం ఈ మేరకు మాట్లాడిన నిర్మలా సీతారామన్, త్వరలో పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టే ఉద్దేశంలో ఉన్నట్లు తెలిపారు.

    బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత హౌస్ ప్యానెల్‌కు సమీక్ష కోసం పంపబడుతుంది.

    ప్రధాన లక్ష్యం ప్రస్తుత పన్ను చట్టాలను సరళీకృతం చేయడం అని స్పష్టం చేశారు.

    వివరాలు 

    మార్చి 10 నుండి ఏప్రిల్ 4 వరకు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 

    అయితే,కొత్త సెస్సును ప్రవేశపెట్టే యోచన లేదని తెలిపారు.కొత్త బిల్లులో అనేక సవరణలు ఉంటాయని, అవి ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.

    2024జూలైలో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా సీతారామన్,ఆదాయపు పన్ను చట్టాన్ని మార్చే ప్రణాళిక ఉందని పేర్కొన్నారు.

    1961 నాటి చట్టాన్ని సమీక్షించి,కొత్త బిల్లు ప్రస్తుత వ్యవస్థను సమూలంగా మారుస్తుందని,ప్రత్యక్ష పన్ను చట్టాలను మరింత సులభతరం చేస్తుందని వివరించారు.

    జనవరి 31న ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి విడత ఫిబ్రవరి 13న ముగియనుంది.

    రెండో విడత మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు కొనసాగనుంది.ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా,ఐటీ చట్టాన్ని సులభతరం చేసేందుకు కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకువస్తుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నిర్మలా సీతారామన్

    తాజా

    Women Powerful Leaders: 97 మందితో హురున్‌ ఇండియా మహిళా నాయకుల జాబితా విడుదల  హురున్ ఇండియా
    Hyundai: తెలంగాణలో  హ్యుందాయ్‌ భారీ టెస్ట్ సెంటర్‌ ఏర్పాటు .. రాష్ట్రంలో 675 ఎకరాల్లో రూ.8,528 కోట్లతో ప్రాజెక్టు  తెలంగాణ
    America: ట్రంప్ కీలక ఉత్తర్వులు.. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం డొనాల్డ్ ట్రంప్
    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం

    నిర్మలా సీతారామన్

    White Paper on Economy: పార్లమెంట్‌లో 'భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం' ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ భారతదేశం
    GST Council: రైల్వే ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు జీఎస్టీ పరిధి నుంచి తొలగింపు .. GST కౌన్సిల్ ప్రధాన నిర్ణయాలు జీఎస్టీ కౌన్సిల్
    Nirmala Sitharaman: నకిలీ ఇన్‌వాయిస్‌,ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌ల ఆటకట్టుకు ఆధార్ తో అనుసంధానం  బిజినెస్
    Budget 2024 expectations: ఆదాయపు పన్ను మినహాయింపు,పెరగనున్న కిసాన్ సమ్మాన్ నిధి మొత్తం; ఈసారి కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతుంది..? బడ్జెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025