NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం
    రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ..

    Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 05, 2025
    09:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    వచ్చే 30 ఏళ్లలో ప్రయాణికుల అవసరాలు గణనీయంగా పెరగనున్ననేపథ్యంలో,విజయవాడ రైల్వే స్టేషన్‌ను ఆధునిక మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయడానికి నీతి ఆయోగ్‌ ఆమోదం తెలిపింది.

    తాజాగా ఈ స్టేషన్‌ కేటగిరీ-1గా గుర్తింపు పొందిన కారణంగా,దానిని పీపీపీ (పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌) మోడల్‌లో రూ.850 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నారు.

    ప్రస్తుతం విజయవాడ రైల్వే స్టేషన్‌ ద్వారా రోజుకు సుమారు 1.14 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.

    రద్దీ సమయాల్లో ఈ సంఖ్య గంటకు 9,120 మందికి చేరుతుంది.2061 నాటికి ఈ గణాంకం రోజుకు 2 లక్షల ప్రయాణికుల వరకు పెరిగే అవకాశముందని అంచనా.

    అందుకు అనుగుణంగా,రద్దీ సమయంలో ఒకేసారి 20,000మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు.

    వివరాలు 

     పశ్చిమ దిశలో కూడా మౌలిక సదుపాయాల విస్తరణ 

    ప్రస్తుతం అభివృద్ధి పనులు ప్రధాన మార్గం వైపు మాత్రమే సాగుతున్నాయి.

    అయితే, భవిష్యత్‌లో కొత్తగా అభివృద్ధి చేయనున్న రైల్వే స్టేషన్‌లో పశ్చిమ దిశలో కూడా మౌలిక సదుపాయాలు విస్తరించనున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ తెలిపారు.

    ఇప్పుడు ఎన్‌ఎస్‌జీ-01 జాబితాలో ఉండే విజయవాడ రైల్వే స్టేషన్‌ విస్తీర్ణం 12,538 చదరపు మీటర్లు కాగా, భవిష్యత్‌లో ఇది 1.54 లక్షల చదరపు మీటర్లకు విస్తరించనున్నారు.

    ఇందులో 84,000 చదరపు మీటర్ల స్థలాన్ని స్టేషన్‌ కోసం ఉపయోగించనుండగా, మిగిలిన 70,000 చదరపు మీటర్లను హోటళ్లు మరియు ఇతర వాణిజ్య సముదాయాల కోసం కేటాయించనున్నారు.

    వివరాలు 

    1,700 కార్లు పార్క్‌ చేసుకునేలా విస్తరణ 

    ప్రస్తుతం పార్కింగ్‌ స్థలం 426 కార్ల సామర్థ్యంతో ఉన్నప్పటికీ, దీనిని 1,700 కార్లు పార్క్‌ చేసుకునేలా విస్తరించనున్నారు.

    అలాగే, ప్రస్తుతం 8 లిఫ్టులు ఉండగా వాటిని 35కి పెంచనున్నారు.

    ఇదే విధంగా, 9 ఎస్కలేటర్ల సంఖ్యను 30కి పెంచే ఉద్దేశం ఉంది.

    ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల విస్తరణ కూడా చేపట్టనున్నారు.

    ప్లాట్‌ఫాం‌ల సంఖ్య ప్రస్తుతం 10గా ఉండగా, భవిష్యత్‌లో వాటిని 12కి పెంచనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విజయవాడ సెంట్రల్

    తాజా

    Vijayawada: రూ.850 కోట్లతో విజయవాడ రైల్వే స్టేషన్‌‌కు మహర్దశ.. ఆధునికీకరించేందుకు నీతి ఆయోగ్‌ ఆమోదం విజయవాడ సెంట్రల్
    Kuppam: కుప్పంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులపైకి కారు.. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన గ్రామీణ సీఐ కుప్పం
    Kuldeep Yadav: చిన్న నాటి స్నేహితురాలు వంశికతో కుల్‌దీప్ యాదవ్ నిశ్చితార్థ వేడుక కుల్దీప్ యాదవ్
    Donald Trump: ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థులపై నిషేధం  డొనాల్డ్ ట్రంప్

    విజయవాడ సెంట్రల్

    జనవరిలోనే సికింద్రాబాద్-విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కనుందా? నరేంద్ర మోదీ
    పాస్‌పోర్ట్ ఆఫీస్‌లు శనివారం కూడా తెరిచే ఉంటాయ్  ఆంధ్రప్రదేశ్
    రికార్డు బద్దలు కొట్టిన ఏపీ జెన్ కో.. ఒక్కరోజులో 105.602 మిలియన్ యూనిట్ల విద్యుత్ విద్యుత్
    'గొట్టంగాళ్లు' అంటూ టీడీపీ ఇన్‌చార్జులపై  కేశినేని నాని ధ్వజం ఎంపీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025