NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్
    తదుపరి వార్తా కథనం
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు',  నితిన్ గడ్కరీ కామెంట్స్
    రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణం వేగవంతం అవుతుందని గడ్కరీ హామీ

    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్

    వ్రాసిన వారు Stalin
    Feb 06, 2023
    06:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎవరైనా దూరప్రయాణాలకు వెళ్లేటప్పడు గమ్య స్థానాలకు త్వరగా చేరుకోవాలంటే విమానాలను ఎంచుకొంటారు. అయితే ఇప్పుడు విమానాల కంటే వేగంగా రోడ్డు మార్గం ద్వారానే వెళ్లొచ్చని చెబుతున్నారు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. సోమవారం ఆజ్‌తక్ నిర్వహించిన కాన్‌క్లేవ్ లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    త్వరలో ప్రధాన నగరాల మధ్య రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణం వేగవంతం అవుతుందని గడ్కరీ హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 12న దిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం కానుంది. ముంబయి-దీల్లీతో పాటు పలు నగరాలు మధ్య గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవేలను కేంద్రం నిర్మిస్తోంది. వీటికోసం ప్రయాణికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని, ఇవి అందుబాటులోకి వస్తే విమానాల కంటే వేగంగా రోడ్డుపై ప్రయాణించవచ్చని చెప్పారు గడ్కరీ.

    గడ్కరీ

    మౌలిక సదుపాయాలపై పెట్టుబడి ద్వారా పేదరిక నిర్మూన

    2024 చివరి నాటికి భారత్‌లో అమెరికా ప్రమాణాలకు సమానమైన రోడ్లు ఉంటాయని గడ్కరీ ఉద్ఘాటించారు. జాతీయ రహదారుల కోసం కేంద్రం ఈ బడ్జెట్‌లో రూ. 24,000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గతంలో ఈ కేటాయింపులు రూ.12వేలు ఉండగా, ఈసారి రూ.24వేల కోట్లకు పెంచినట్లు చెప్పారు.

    నీరు, విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాలపై పెట్టే పెట్టుబడులు పేదరికాన్ని నిర్మూలించడానికి, దేశ అభివృద్ధికి దోహదపడుతాయని గడ్కరీ అన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే, అవి పరిశ్రమలను ఆకర్షిస్తాయన్నారు. తద్వారా మూలధన పెట్టుబడులు పెరుగుతాయని చెప్పారు. ఎక్కువ మూలధన పెట్టుబడి వస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. ఇది దేశంలో పేదరికాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని వ్యాఖ్యానించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నితిన్ గడ్కరీ
    బీజేపీ
    ముంబై

    తాజా

    Mohanlal: మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు సినిమా
    Airlines Alert: భారీ వర్షం కారణంగా గోవాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయి: ఇండిగో  ఇండిగో
    MI vs DC: ఓడిన జట్టు ఔట్.. వాంఖడే వేదికగా ముంబయి-ఢిల్లీ మధ్య ఉత్కంఠ భరిత పోరు ముంబయి ఇండియన్స్
    Stock Market: లాభాల్లో రాణిస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,700 స్టాక్ మార్కెట్

    నితిన్ గడ్కరీ

    2024 నాటికి 15 లక్షల కోట్లకు చేరుకునే లక్ష్యం దిశగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్: నితిన్ గడ్కరీ ఆటో మొబైల్

    బీజేపీ

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? ధర్మపురి
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు విమానం

    ముంబై

    విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన విమానం
    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ఎన్ఐఏ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025