NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి
    తదుపరి వార్తా కథనం
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి
    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు

    ముంబయి-గోవా హైవేపై కారును ఢీకొన్న ట్రక్కు, 9మంది మృతి

    వ్రాసిన వారు Stalin
    Jan 19, 2023
    10:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని ముంబయి-గోవా హైవేపై మంగావ్ ప్రాంతంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ట్రక్కు ఢీకొన్న ఈ ప్రమాదంలో 9 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు.

    ఉదయం 5 గంటల ప్రాంతంలో రేపోలి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. వేగంగా వస్తున్న కారును ట్రక్కు వేగంగా వచ్చిన ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

    రోడ్డు ప్రమాదం

    నాలుగేళ్ల బాలికకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు

    మరణించిన తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి, ఐదుగురు పురుషులు ఉన్నారు. అలాగే ప్రమాదంలో నాలుగేళ్ల బాలిక గాయపడింది. విషయం తెలుసుకున్న గోరేగావ్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సాయంతో చిన్నారిని రక్షించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.

    మహారాష్ట్రలో ఏడాదికేడాది రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. 2022లో జనవరి- సెప్టెంబర్ మధ్య మహారాష్ట్రలో 24,360 రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు రాష్ట్ర రవాణా శాఖ నివేదకలు చెబుతున్నాయి. 2022లో జరిగిన ఈ ప్రమాదాల్లో మొత్తం 11,149 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021తో పోలిస్తే 2022లో 1,272 ఎక్కువ మరణాలు సంభవించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర
    రోడ్డు ప్రమాదం

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    మహారాష్ట్ర

    ముంబయి పర్యటనకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి యోగి ఆదిత్యనాథ్
    నాసిక్-షిర్డీ హైవే ట్రక్కును ఢీకొన్న బస్సు, 10మంది మృతి రోడ్డు ప్రమాదం

    రోడ్డు ప్రమాదం

    2021లో లక్షా యాభై మూడు వేలమందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో బలి భారతదేశం
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని దిల్లీ
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025