Nishant Kumar: జేడీయూలో చేరిన నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) పార్టీలోకి ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ అధికారికంగా చేరారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో 50 ఏళ్ల నిశాంత్ కుమార్ జేడీయూ సభ్యత్వం స్వీకరించారు. రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్న నితీష్ కుమార్ త్వరలో తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఇప్పటికే 2026 రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్చి 16న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
Details
ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు
దీంతో రాజ్యసభ ఎన్నికల తర్వాత సీఎం పదవిని ఆయన వీడనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా బీహార్ రాష్ట్రంలో తదుపరి ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ చెందిన నేత బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాల మధ్య నిశాంత్ కుమార్ను బీహార్ ఉప ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.