NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ప్రపంచ దేశాధినేతలకు కనీవినీ ఎరుగని రీతిలో ఆతిథ్యం.. మమతా, నితీశ్ హాజరయ్యే అవకాశం
    తదుపరి వార్తా కథనం
    ప్రపంచ దేశాధినేతలకు కనీవినీ ఎరుగని రీతిలో ఆతిథ్యం.. మమతా, నితీశ్ హాజరయ్యే అవకాశం
    సీఎంలు మమతా, నితీష్ హాజరయ్యే అవకాశం

    ప్రపంచ దేశాధినేతలకు కనీవినీ ఎరుగని రీతిలో ఆతిథ్యం.. మమతా, నితీశ్ హాజరయ్యే అవకాశం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 08, 2023
    12:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    G- 20 సదస్సుకు సర్వం ముస్తాబైంది. విదేశీ అతిథులకు అద్భుతమైన ఆతిధ్యం ఇచ్చేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం విందు ఏర్పాటు చేశారు.

    ఈ మేరకు మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్ డీ దేవగౌడలకు కేంద్రం ఆహ్వానాలు పంపించింది.

    ప్రతిపక్ష కూటమి నేతలు బీహార్ సీఎం నితీశ్ కుమార్,బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు ఇప్పటికే ఆహ్వానం అందగా, వారు హాజరవనున్నట్లు సమాచారం.

    ఈ విందులోనే G-20 సదస్సుకు దిల్లీ వచ్చే దేశాధినేతల సతీమణులు,కుటుంబీకులకు అద్వితీయమైన అనుభూతిని కలిగించేందుకు కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేసింది.

    జీ-20 సదస్సుకు భారత్ నాయకత్వం వహించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో కేంద్రం వైఖరిని మెచ్చుకున్నారు.

    DETAILS

    అతిథులను మైమరపించే అరుదైన సంగీత కచేరీ

    భారతీయ శాస్త్రీయ సంగీతంలోని మాధుర్యాన్ని ప్రపంచ దేశాల అతిథులకు తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ సంగీత రూపకాలను ప్రదర్శించనున్నారు.

    గంటన్నర పాటు సాగే వాద్య దర్శన్ కోసం వైవిధ్యమైన వాద్య పరికరాలను ఉపయోగించనున్నారు. అతి అరుదుగా కనిపించే సుర్‌బహార్, జల్‌తరంగ్, నల్‌తరంగ్, విచిత్ర వీణ, రుద్ర వీణ, సరస్వతి వీణ, ధాంగ్లీ, సుంద్రీ, భాపాంగ్, దిల్‌రుబా వంటి సంగీత పరికరాలతో మైమరపించనున్నారు.

    34 హిందుస్తానీ వాద్య పరికరాలు, 18 కర్ణాటక సంగీత పరికరాలు, 26 జానపద సంగీత పరికరాలను ప్రదర్శించనున్నారు. ఇందులో 11 మంది చిన్నారులు, దివ్యాంగులు సహా మొత్తం 78 మంది కళాకారులు కచేరీలో భాగం కానున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    జీ-20 డిన్నర్ కు మాజీ ప్రధానులకు  ఆహ్వానం

    Former PMs Manmohan Singh and HD Deve Gowda invited to G20 dinner

    Read @ANI Story | https://t.co/IGDlNVsnGQ#G20India2023 #G20SummitDelhi #G20 #ManmohanSingh #HDDeveGowda #G20Summit pic.twitter.com/i4ZRadEWIW

    — ANI Digital (@ani_digital) September 8, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీ20 సమావేశం
    రాష్ట్రపతి

    తాజా

    Pakistan:పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ.. జ్యోతి మల్హోత్రాను ఓ అస్త్రంగా మలుచుకున్నారు: హర్యానా పోలీసులు   జ్యోతి మల్హోత్రా
    Supreme Court: కల్నల్ సోఫియాపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మంత్రి విజయ్ షాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం సుప్రీంకోర్టు
    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ ప్రధాన మంత్రి
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  భారతదేశం
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  శ్రీనగర్
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  పర్యటక శాఖ మంత్రి

    రాష్ట్రపతి

    74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్య‌పథ్‌‌లో అంబరాన్నంటిన సంబరాలు గణతంత్ర దినోత్సవం
    Budget 2023: 'రాబోయే పాతికేళ్లు దేశానికి ఎంతో కీలకం', పార్లమెంట్‌లో రాష్ట్రపతి ముర్ము ద్రౌపది ముర్ము
    రాష్ట్రపతి ప్రసంగాన్ని విమర్శించినందుకు చాలా సంతోషం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కాంగ్రెస్ పాలనలో పదేళ్లను కోల్పోయాం, 2030వ దశకం భారత దశాబ్దం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025