Nizams jewels: నిజాం ఆభరణాలు RBIలో సురక్షితం: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
నిజాం నగరానికి చెందిన విలువైన ఆభరణాలు కేంద్ర రిజర్వ్ బ్యాంక్ (RBI) లో సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆభరణాల చారిత్రక,సాంస్కృతిక,వారసత్వ ప్రాముఖ్యతను గుర్తించి,అత్యంత భద్రతా ప్రమాణాలతో వాటిని RBI వాల్ట్స్లో భద్రం చేశామన్నారు. ఈ సమాచారం రాజ్యసభలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాతపూర్వకంగా తెలియజేశారు. ప్రజలకు హైదరాబాద్లో వీటిని ప్రదర్శించాలన్నఅంశంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. నిజాం పాలకులకు చెందిన 173 అద్భుతమైన ఆభరణాలు(Nizam's jewels)1995 నుండి ఆర్బీఐ వాల్ట్స్లోనే భద్రంగా ఉన్నాయని ప్రభుత్వానికి తెలుసా..? అని కొందరు సభ్యులు మంత్రిని ప్రశ్నించారు. దీనికి ఆయన తెలుసని బదులిచ్చారు. నిజాంలు హైదరాబాద్ను పాలించారు.స్వాతంత్ర్యానంతరం ఈ భూభాగం భారత్లో విలీనమైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
173 నిజాం ఆభరణాలు 1995 నుంచి RBI వాల్ట్స్లోనే భద్రం
सरकार ने राज्यसभा में बताया कि निजाम के 173 बहुमूल्य गहने 1995 से भारतीय रिजर्व बैंक के वॉल्ट में कड़ी सुरक्षा में रखे गए हैं. संस्कृति मंत्रालय ने इनके ऐतिहासिक, सांस्कृतिक और विरासत महत्व को स्वीकार किया है. केंद्रीय संस्कृति मंत्री गजेंद्र सिंह शेखावत ने स्पष्ट किया कि फिलहाल… pic.twitter.com/2ot7QxJZjs
— AajTak (@aajtak) January 30, 2026