NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress: కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా 
    తదుపరి వార్తా కథనం
    Congress: కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా 
    Congress: కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట

    Congress: కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా 

    వ్రాసిన వారు Stalin
    Apr 01, 2024
    01:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సుప్రీంకోర్టు నుంచి కాంగ్రెస్‌కు ఊరట లభించింది. ప్రస్తుతం రూ.3500 కోట్ల డిమాండ్ నోటీసుపై జూలై 24వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఆదాయపన్ను శాఖ సుప్రీంకోర్టులో తెలిపింది.

    ఆదాయపు పన్ను శాఖపై కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది.

    ఈ సందర్భంగా అన్ని పక్షాల న్యాయవాదులు తమ తమ వాదనలను వినిపించారు.

    అన్ని పక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం జూన్‌లోగా సమాధానం ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.

    ఈ కేసు తదుపరి విచారణ జూలై 24న జరగనుంది. 1700 కోట్లకు నోటీసు పంపామని విచారణ సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

    ఎన్నికలు 

    ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు 

    మరోవైపు, కాంగ్రెస్ తరపున హాజరైన అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. 1995-96 నుంచి ఇప్పటి వరకు 3500 డిమాండ్ చేశారని, అయితే పిటిషన్ ఇప్పటికే కోర్టులో పెండింగ్‌లో ఉందని అన్నారు.

    ఆగస్టు నెలలో కేసు విచారణ జరగాలన్నారు. అప్పటి వరకు ఆదాయపు పన్ను శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకూడదన్నారు.

    ఈ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మాట్లాడుతూ.. లోక్‌ సభ ఎన్నికలు ముగిసే వరకు ఏ పార్టీని ఆదాయపన్ను శాఖ బకాయిల విషయంలో ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని తెలియజేశారు.

     ఆదాయపు పన్ను శాఖ 

    ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్‌కు కొత్త నోటీసు 

    ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్‌కు కొత్త నోటీసు ఇచ్చింది.

    ఇందులో 2014 నుంచి 2017 వరకు రూ.1745 కోట్ల పన్ను డిమాండ్ చేశారు.

    ఈ కొత్త నోటీసుతో కాంగ్రెస్‌పై పన్ను డిమాండ్ రూ.3567 కోట్లకు పెరిగింది.

    ఆదాయపు పన్ను 2014-15కి రూ.663 కోట్లు, 2015-16కి రూ.664 కోట్లు, 2016-17కి రూ.417 కోట్ల పన్ను డిమాండ్ నోటీసులను కాంగ్రెస్‌కు పంపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుప్రీంకోర్టు
    కాంగ్రెస్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    సుప్రీంకోర్టు

    Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు... గుజరాత్‌లో లొంగిపోయిన అందరు ఖైదీలు బిల్కిస్‌ బానో కేసు
    Loan Scam Case: వాధ్వాన్ సోదరుల బెయిల్‌ను రద్దు చేసిన సుప్రీంకోర్టు  తాజా వార్తలు
    chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ చంద్రబాబు నాయుడు
    Hemant Soren: ఈడీ అరెస్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్ సోరెన్ హేమంత్ సోరెన్

    కాంగ్రెస్

    Ashok Chavan: నేడు బీజేపీలో చేరనున్న మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్  మహారాష్ట్ర
    Medigadda tour: మేడిగడ్డకు సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు  మేడిగడ్డ బ్యారేజీ
    AAP: అర్హత లేకుండా దిల్లీలో కాంగ్రెస్‌కు ఒక సీటు ఇస్తాం: ఆప్ సంచలన కామెంట్స్ దిల్లీ
    Rahul Gandhi: ఎంఎస్‌పీకి చట్టబద్ధత కల్పిస్తాం: రైతులకు మద్దతు తెలిపిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025