NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌
    భారతదేశం

    ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌

    ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌
    వ్రాసిన వారు Naveen Stalin
    Jan 20, 2023, 06:12 pm 0 నిమి చదవండి
    ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌
    ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని చెప్పిన బ్రిజ్ భూషణ్ సింగ్‌

    మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌ స్పందించారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో తాను ఫెడరేషన్ పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదన్నారు. తనకు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల ఈ పదవి దక్కలేదన్నారు. ప్రజలు ఎన్నుకోవడం వల్ల తాను ఇక్కడ కూర్చున్నట్లు స్పష్టం చేశారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌తోపాటు పలువురు కోచ్‌లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా వంటి స్టార్ రెజ్లర్లు డబ్ల్యుఎఫ్‌ఐకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌‌తో కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

    భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉషకు లేఖ రాసిన రెజ్లర్లు

    భూషణ్ సింగ్‌.. బల్గేరియా టోర్నీ సందర్భంగా అమ్మాయిలు బసచేసే హోటల్ గదులకు అడ్డంగా పడుకునేవాడని ఓ అమ్మాయి ఆరోపించింది. దీనిపై భూషణ్ సింగ్‌ స్పందించారు. ఆరోపించిన అమ్మాయి అసలు టోర్నీలోనే లేదని చెప్పారు సింగ్. అంతేకాకుండా తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు బ్రిజ్ భూషణ్ సింగ్‌. తాను ఇంకా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కానీ, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కానీ కలవలేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ)చీఫ్ పీటీ ఉషకు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, ఇతర భారతీయ రెజ్లర్లు లేఖ రాశారు. డబ్య్లూఎఫ్ఐకి సంబంధించిన వ్యవహారాలపై విచారణ జరిపేందుకు తమతో సంప్రదించి కమిటీని నియమించాలని ఐఓఏను అభ్యర్థించారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    దిల్లీ

    తాజా

    Find X6, X6 Pro స్మార్ట్‌ఫోన్‌లను ప్రకటించిన OPPO స్మార్ట్ ఫోన్
    SCO Event: పాకిస్థాన్ మ్యాప్‌పై భారత్ అభ్యంతరం; తోకముడిచిన దాయాది దేశం జమ్ముకశ్మీర్
    రోల్స్ రాయిస్ చివరి V12-పవర్డ్ కూపే ప్రత్యేకత ఏంటో తెలుసా ఆటో మొబైల్
    UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది బ్యాంక్

    దిల్లీ

    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత; అరెస్టుపై ఊహాగానాలు కల్వకుంట్ల కవిత
    భారత్‌లోని విదేశీ రాయబారులకు కేంద్రమంత్రి హోదా; ఇతర దేశాల్లో మన హైకమిషన్లపై ఎందుకంత నిర్లక్ష్యం! భారతదేశం
    దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు జపాన్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023