NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌
    తదుపరి వార్తా కథనం
    ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌
    ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని చెప్పిన బ్రిజ్ భూషణ్ సింగ్‌

    ఫెడరేషన్ పదవి నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు: డబ్య్లూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌

    వ్రాసిన వారు Stalin
    Jan 20, 2023
    06:12 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌ స్పందించారు. లైంగిక ఆరోపణల నేపథ్యంలో తాను ఫెడరేషన్ పదవి నుంచి వైదొలిగే ప్రసక్తే లేదన్నారు. తనకు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల ఈ పదవి దక్కలేదన్నారు. ప్రజలు ఎన్నుకోవడం వల్ల తాను ఇక్కడ కూర్చున్నట్లు స్పష్టం చేశారు.

    బ్రిజ్ భూషణ్ సింగ్‌తోపాటు పలువురు కోచ్‌లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా వంటి స్టార్ రెజ్లర్లు డబ్ల్యుఎఫ్‌ఐకి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు. అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌‌తో కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

    దిల్లీ

    భారత ఒలింపిక్ సంఘం చీఫ్ పీటీ ఉషకు లేఖ రాసిన రెజ్లర్లు

    భూషణ్ సింగ్‌.. బల్గేరియా టోర్నీ సందర్భంగా అమ్మాయిలు బసచేసే హోటల్ గదులకు అడ్డంగా పడుకునేవాడని ఓ అమ్మాయి ఆరోపించింది. దీనిపై భూషణ్ సింగ్‌ స్పందించారు. ఆరోపించిన అమ్మాయి అసలు టోర్నీలోనే లేదని చెప్పారు సింగ్.

    అంతేకాకుండా తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు బ్రిజ్ భూషణ్ సింగ్‌. తాను ఇంకా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కానీ, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కానీ కలవలేదని పేర్కొన్నారు.

    ఈ వ్యవహారంపై భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ)చీఫ్ పీటీ ఉషకు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, ఇతర భారతీయ రెజ్లర్లు లేఖ రాశారు. డబ్య్లూఎఫ్ఐకి సంబంధించిన వ్యవహారాలపై విచారణ జరిపేందుకు తమతో సంప్రదించి కమిటీని నియమించాలని ఐఓఏను అభ్యర్థించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    దిల్లీ

    తాగిన మత్తులో మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఆ తర్వాత ఏం జరిగింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్
    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025