
Rahul Gandhi: ఓట్లను తొలగించడానికి సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్నారు: రాహుల్ గాంధీ ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పట్టున్న ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ఓట్లను తొలగించారని ఆయన విమర్శించారు. రాష్ట్రం వెలుపలి వ్యక్తుల పేర్లతో నకిలీ లాగిన్లు, తప్పుడు ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తొలగించారని వ్యాఖ్యానించారు. కేంద్రీకృత విధానంలో సాఫ్ట్వేర్ సహాయంతో ఈ చర్యలు జరిగాయని ఆరోపించారు. ఈ విషయంపై ఆయన ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
వివరాలు
అలంద్ ప్రాంతంలో ఆరు వేల ఓట్లను తొలగించే ప్రయత్నం: రాహుల్
"ఈ ఓట్ల తొలగింపు అంతా వ్యక్తులతో గాకుండా సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేస్తున్నారు. అదంతా ఒక ప్రక్రియ ప్రకారం జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలకు ఓటు వేసే కమ్యూనిటీలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని తొలగింపులు జరుగుతున్నాయి. ఈ విషయంలో మాకు 100 శాతం ఆధారాలు లభించాయి. నేను దేశాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను. ప్రజాస్వామ్య ప్రక్రియను ఇష్టపడతాను, దానిని కాపాడటం నా బాధ్యత. ఇకపై దీనిపై ఎలా స్పందించాలనేది మీ చేతుల్లోనే ఉంది. ఉదాహరణకు, కర్ణాటకలోని అలంద్ ప్రాంతంలో ఆరు వేల ఓట్లను తొలగించే ప్రయత్నం జరిగింది" అని ఆయన విమర్శించారు.
వివరాలు
అది అసలు పేలని బాంబ్
అదేవిధంగా, ఓట్ల చోరీకి పాల్పడుతున్నవారిని ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రక్షిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని మేము చేస్తున్న అభ్యర్థనలను ఎన్నికల సంఘం పట్టించుకోవడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది హైడ్రోజన్ బాంబ్లాంటిది కాదని, అయితే దీన్ని తాను త్వరలో బయటపెడతానని హెచ్చరించారు. రాహుల్ ఆరోపణలను ఎన్నికల సంఘం, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖండించాయి. ఆయన చేసిన "బాంబ్" వ్యాఖ్యను బీజేపీ ఎగతాళి చేస్తూ - అది అసలు పేలని బాంబ్ అని ఎద్దేవా చేసింది.