LOADING...
Raghav Chadha: భయంతో కాదు.. బలవంతంగానే బయటకు వచ్చాం: రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు
భయంతో కాదు.. బలవంతంగానే బయటకు వచ్చాం: రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు

Raghav Chadha: భయంతో కాదు.. బలవంతంగానే బయటకు వచ్చాం: రాఘవ్ చద్దా సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 25, 2026
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ చేరిన ఎంపీ రాఘవ్ చడ్ఢా ఆమ్‌ఆద్మీ పార్టీని వీడటంపై మరోసారి స్పందించారు. తాను సహా మరికొందరు ఎంపీలు భయంతో పార్టీని వీడలేదని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వంలోని విధానాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. తాజా పరిణామాలపై మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీ సరైన దిశలో ప్రయాణించట్లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. అహర్నిశలు కష్టపడి పనిచేసిన అనేక కార్యకర్తలు, నేతలు ఇప్పటికే పార్టీని వీడారని, మరికొందరు కూడా బయటకు వెళ్లే ప్రక్రియలో ఉన్నారని తెలిపారు. పార్టీలో ఉండేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. భయంతో కాకుండా నిరాశ, అసహ్యం, నిస్పృహ కారణంగానే తాము బయటకు వచ్చామని స్పష్టం ఆయన చేశారు.

వివరాలు

వ్యక్తిగత లాభాల కోసమే పనిచేస్తోంది

దిల్లీ రాజకీయాల్లో ప్రస్తావనకు వచ్చిన 'శీష్ మహల్' వివాదం కారణంగా ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిందని ఆయన విమర్శించారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికలులో పార్టీ ఓటమికి ఇది ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ఏడాదిలోపే 'శీష్ మహల్ పార్ట్-2' కూడా వచ్చిందని విమర్శించారు. అంతేకాకుండా, ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రస్తుతం అవినీతిపరులు, రాజీపడిన నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన ఆరోపించారు. ఇటీవల పార్టీ నుంచి బయటకు వచ్చిన ఇతర ఎంపీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత లాభాల కోసం పార్టీ పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. అందుకే సరైన రాజకీయ వేదికలో లేననే భావనతో బయటకు రావాల్సి వచ్చిందని రాఘవ్ చడ్ఢా పేర్కొన్నారు.

Advertisement