Loading...
NEET UG Re-Exam 2026: నీట్‌-యూజీ రీ టెస్ట్‌ ఓఎంఆర్‌ షీట్లపై ఎన్‌టీఏ హెచ్చరిక.. అలా చేస్తే కఠిన చర్యలు!
నీట్‌-యూజీ రీ టెస్ట్‌ ఓఎంఆర్‌ షీట్లపై ఎన్‌టీఏ హెచ్చరిక.. అలా చేస్తే కఠిన చర్యలు!

NEET UG Re-Exam 2026: నీట్‌-యూజీ రీ టెస్ట్‌ ఓఎంఆర్‌ షీట్లపై ఎన్‌టీఏ హెచ్చరిక.. అలా చేస్తే కఠిన చర్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 19, 2026
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

నీట్‌-యూజీ రీ టెస్ట్‌ 2026 (NEET UG Re-Exam 2026) ఫలితాల నేపథ్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. మార్కుల్లో తేడా ఉందని పేర్కొంటూ తప్పుడు లేదా కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించిన ఓఎంఆర్‌ (OMR) షీట్లను సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అలాంటి చర్యలు చట్టపరమైన ఇబ్బందులకు దారితీస్తాయని కూడా హెచ్చరించింది. ఈ నెల 16న నీట్‌ యూజీ రీ టెస్ట్‌ ఫలితాలను ఎన్‌టీఏ విడుదల చేసిన విషయం తెలిసిందే.

వివరాలు

అధికారిక ప్రకటన విడుదల

అయితే కొందరు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ వద్ద ఉన్న ఓఎంఆర్‌ షీట్‌ ఆధారంగా లెక్కించిన మార్కులకు, అధికారికంగా ప్రకటించిన నీట్‌ స్కోరుకు మధ్య వ్యత్యాసం ఉందని పేర్కొంటూ ఎన్‌టీఏకు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎన్‌టీఏ కీలక విషయాన్ని గుర్తించింది.

సమర్పించిన ఓఎంఆర్‌ షీట్లలో చాలా వరకు కృత్రిమ మేధ (AI) సాయంతో మార్పులు చేసి రూపొందించినవేనని నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించింది.

తప్పుదోవ పట్టించి అధిక మార్కులు సాధించే ఉద్దేశంతో కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

వివరాలు

11.21 లక్షల మంది అర్హత

ఇదిలా ఉండగా మే 3న నిర్వహించిన నీట్‌-యూజీ పరీక్ష రద్దు కావడంతో ఎన్‌టీఏ జూన్‌ 21న రీ టెస్ట్‌ నిర్వహించింది.

ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో 11.21 లక్షల మంది అర్హత సాధించినట్లు ఎన్‌టీఏ వెల్లడించింది.

దేశంలోని 66 నగరాల నుంచి మొత్తం 138 మంది విద్యార్థులు టాప్‌ ర్యాంకులు సాధించారు.

మొత్తం 720 మార్కులకు గాను 705కు పైగా మార్కులు సాధించిన 17 మంది టాపర్లుగా నిలిచినట్లు ఎన్‌టీఏ వివరించింది.

ADVERTISEMENT