NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nuh violence: నుహ్ హింసలో పాల్గొన్నవారిపై ఉక్కుపాదం; రోహింగ్యాల అరెస్ట్ 
    తదుపరి వార్తా కథనం
    Nuh violence: నుహ్ హింసలో పాల్గొన్నవారిపై ఉక్కుపాదం; రోహింగ్యాల అరెస్ట్ 
    నుహ్ హింసలో పాల్గొన్నవారిపై ఉక్కుపాదం; రోహింగ్యాల అరెస్ట్

    Nuh violence: నుహ్ హింసలో పాల్గొన్నవారిపై ఉక్కుపాదం; రోహింగ్యాల అరెస్ట్ 

    వ్రాసిన వారు Stalin
    Aug 07, 2023
    03:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హర్యానాలోని నుహ్‌లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో అక్కడ కొన్ని రోజులుగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

    ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్నాయి. హింసలో పాల్గొన్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

    ఒకవైపు ప్రభుత్వం హింసకు పాల్పడినట్లు అనుమానిస్తున్న వారి హోటళ్లు, ఇళ్లు, అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చేస్తోంది.

    మరోవైపు నుహ్‌లో హింసాకాండకు సంబంధించిన కేసుల్లో ఇక్కడ నివసిస్తున్న రోహింగ్యాలపై చర్యలు తీసుకుంటోంది.

    ఇప్పటికే పోలీసులు పలువురు రోహింగ్యాలను అరెస్టు చేశారు.

    హర్యానా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి చెందిన భూమిని రోహింగ్యాలు ఆక్రమించుకున్నారు.

    ఆ భూమిలో నిర్మాణాలను చేపట్టారు. ఆ ఆక్రమ నిర్మాణాలను ఉపయోగించి జూలై 31న జరిగిన హింసలో రోహింగ్యాలు రాళ్లు రువ్వినట్లు పోలీసులు గుర్తించారు.

    హర్యానా

    సాక్ష్యాల ఆధారంగానే అరెస్టులు: నుహ్ ఎస్పీ 

    హింసలో పాల్గొన్న వారికి వ్యతిరేకంగా సాక్ష్యాలను గుర్తించినట్లు నుహ్ ఎస్పీ తెలిపారు. ఆ సాక్ష్యాల ఆధారంగానే వారిని అరెస్టు చేశామన్నారు.

    రోహింగ్యాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రోహింగ్యా హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ ఎన్జీవో ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. రోహింగ్యాలందరూ రోజువారీ కూలీ పనులు చేస్తుంటారని వారు పేర్కొన్నారు.

    17మంది రోహింగ్యాలు హింసకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. వారిని అరెస్టు చేసి, వారికి సంబంధించిన నిర్మాణాలపై బుల్డోజర్లను కూడా ఉపయోగించారు.

    జులై 31న నుహ్‌లో మతపరమైన ఊరేగింపు సందర్భంగా రాళ్లు రువ్వడంతో హింస చెలరేగింది. నుహ్‌నుంచి మొదలైన హింస చుట్టుపక్కల జిల్లాలకు వ్యాపించింది.

    ఈ ఘర్షణల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఇప్పటివరకు 150మందిని అరెస్టు చేయగా, 50కిపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హర్యానా
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    హర్యానా

    ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా 56వ సారి బదిలీ భారతదేశం
    డేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్ ఉత్తర్‌ప్రదేశ్
    ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు ఉత్తర్‌ప్రదేశ్
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం

    తాజా వార్తలు

    దిల్లీ-ఎన్సీఆర్‌లో వీహెచ్‌పీ-బజరంగ్ దళ్ ర్యాలీలను ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్  హర్యానా
    భారతీ సిమెంట్స్‌ ఎఫ్‌డీ కేసు; తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే సుప్రీంకోర్టు
    దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు దిల్లీ ఆర్డినెన్స్
    హర్యానాలో హింసపై దర్యాప్తుకు సిట్‌ ఏర్పాటు: డీజీపీ పీకే అగర్వాల్  హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025