NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / surrogacy: సరోగసీతో సంతానం పొందిన వారికీ ప్రసూతి సెలవులు.. ఆ రాష్ట్రం కీలక నిర్ణయం
    తదుపరి వార్తా కథనం
    surrogacy: సరోగసీతో సంతానం పొందిన వారికీ ప్రసూతి సెలవులు.. ఆ రాష్ట్రం కీలక నిర్ణయం
    సరోగసీతో సంతానం పొందిన వారికీ ప్రసూతి సెలవులు

    surrogacy: సరోగసీతో సంతానం పొందిన వారికీ ప్రసూతి సెలవులు.. ఆ రాష్ట్రం కీలక నిర్ణయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 27, 2024
    12:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశా ప్రభుత్వం సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే తల్లుల కోసం ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

    ఈ కొత్త నిబంధన ప్రకారం, సరోగసీ ద్వారా సంతానాన్ని పొందిన ప్రభుత్వ ఉద్యోగినులకు ఆరు నెలల ప్రసూతి సెలవులు అందించాలనే నిర్ణయం తీసుకుంది.

    దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ కింద, మహిళా ఉద్యోగులకు 180 రోజుల సెలవులు, పురుష ఉద్యోగులకు 15 రోజుల సెలవులు తీసుకునే వెసులుబాటు ఉంది.

    వివరాలు 

    180 రోజుల మాతృత్వ సెలవులు

    ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న మహిళలు సరోగసీ ద్వారా సంతానాన్ని పొందితే (కమిషనింగ్ మదర్), వారికి 180 రోజుల మాతృత్వ సెలవులు వర్తిస్తాయి.

    సరోగసీ కోసం గర్భం అద్దెకిచ్చిన మహిళ కూడా (సరోగేట్) ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటే, ఆమెకు కూడా ఈ సెలవులు వర్తిస్తాయి.ఇద్దరు సంతానం వరకే సెలవులు పొందొచ్చు.

    ఈ సెలవులను పొందాలంటే, రిజిస్టర్‌ చేసిన వైద్యులు లేదా ఆసుపత్రుల ద్వారా సరోగసీ తల్లి, కమిషనింగ్ తల్లీతండ్రి మధ్య ఒప్పందాన్ని సమర్పించాల్సి ఉంటుంది, అని నోటిఫికేషన్‌లో స్పష్టంగా తెలిపింది.

    వివరాలు 

    అయిదేళ్లు కలిసి ఉన్న దంపతులే సరోగసీకి అర్హులు

    చట్టబద్ధమైన వివాహం ద్వారా ఐదు సంవత్సరాలు కలిసి ఉన్న దంపతులు మాత్రమే సరోగసీకి అర్హులు.

    భార్య వయస్సు 23-50 సంవత్సరాల మధ్య ఉండాలి, భర్త వయస్సు 26-55 సంవత్సరాల మధ్య ఉండాలి.

    సాధారణ పద్ధతుల్లో సంతానం కలగని పరిస్థితుల్లో మాత్రమే ఈ దంపతులు సరోగసీ ద్వారా బిడ్డను పొందవచ్చు.

    సరోగసీ పద్ధతిలో సంతానం పొందుతున్న వారికి మాతృత్వ, పితృత్వ సెలవుల ప్రయోజనాలను కొన్ని నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో, ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా

    తాజా

    Russia drone attacks: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి: ఒకేసారి 273 డ్రోన్లు ప్రయోగం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Nandigam Suresh: టీడీపీ కార్యకర్తపై దాడి.. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు వైసీపీ
    NASA: సౌర కుటుంబానికి బయట నీటి ఉనికి గుర్తించిన నాసా నాసా
    Vijay Deverakonda: సినిమా విడుదలను ఆపేయాలనుకున్నారు.. కానీ నమ్మకమే నిలబెట్టింది : విజయ్‌ దేవరకొండ విజయ్ దేవరకొండ

    ఒడిశా

    నవీన్ పట్నాయక్ సోదరి, ప్రముఖ రచయిత కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన మోదీ నవీన్ పట్నాయక్
     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    Dress code: పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్.. జీన్స్, స్కర్టులు ధరిస్తే నో ఎంట్రీ  తాజా వార్తలు
    ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కార్యదర్శి పదవీ విరమణ నవీన్ పట్నాయక్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025