NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు..
    తదుపరి వార్తా కథనం
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు..
    భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు బయలుదేరిన భర్త

    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు..

    వ్రాసిన వారు Stalin
    Feb 09, 2023
    12:17 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో హృదయ విదారక సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అంబులెన్స్‌కు డబ్బులు లేక భార్య మృతదేహాన్ని భూజలపై మోసుకుంటూ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నఇంటికి బయలుదేరాడో ఓ భర్త.

    ఒడిశాలోని కోరాపుట్ జిల్లాకు చెందిన సాములు పాంగి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ఓ ఆసుపత్రిలో చేర్పించాడు. అప్పటికే ఆమెపై ఆశలు వదులుకోవాలని డాక్టర్లు పాంగికి చెప్పారు.

    కొన ఊపిరితో ఉన్న తన భార్యను 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరికి తీసుకెళ్లడానికి పాంగి ఆటోను మాట్లాడుకున్నాడు. ఆటోలో కొద్ది దూరం వెళ్లగానే ఆమె మృతి చెందింది. దీంతో ఆ ఆటోడ్రైవర్ మానవత్వం మరిచి విజయనగరం రూరల్‌ సర్కిల్‌ పరిధిలో మృతదేహాన్ని దింపేశాడు.

    ఆంధ్రప్రదేశ్

    విజయనగరం రూరల్‌ పోలీసుల మానవత్వం

    మరో వాహనం మాట్లాడుకునేందుకు డబ్బులు లేక, భార్య మృతదేహాన్ని భుజంపై వేసుకుని 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటి వైపు నడవడం ప్రారంభించాడు.

    ఈ విషయం తెలుసుకున్న స్థానికులు రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ టీవీ తిరుపతిరావుకు చెప్పారు. అనంతరం పోలీసులు సాములు పాంగి వద్దకు చేరుకొని ఏమైందని ఆరా తీశారు. భాష సమస్య వల్ల పాంగి ఏం మాట్లాడుతున్నాడో తెలియక విజయనగరం పోలీసులు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత అసలు విషయాన్ని తెలుసుకున్న పోలీసులు పాంగి భార్య మృత దేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.

    పోలీసుల సహాయానికి పాంగి కృతజ్ఞతలు తెలిపాడు. సకాలంలో స్పందించినందుకు స్థానికులు పోలీసులను అభినందించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ఒడిశా
    విశాఖపట్టణం

    తాజా

    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ

    ఆంధ్రప్రదేశ్

    'రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప ఎవరూ కాపాడలేరు'.. సీఎం జగన్‌పై కడప వైసీపీ నేత ఆరోపణలు వై.ఎస్.జగన్
    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? వై.ఎస్.జగన్
    తెలంగాణలో టీడీపీ రీఎంట్రీ.. ఏ పక్షానికి నష్టం ? ఏ పార్టీకి లాభం? తెలంగాణ
    చంపేస్తామని మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరిక.. గుడివాడలో దుండగుల హల్‌చల్ చంద్రబాబు నాయుడు

    ఒడిశా

    ఫిబ్రవరి 5న బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్! భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్

    విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025