
OLA: ఓలా ఇంజనీర్ ఆత్మహత్య.. భవేష్ అగర్వాల్ పై కేసు నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. ఓలా ఎలక్ట్రిక్స్లో పనిచేస్తున్న 38 ఏళ్ల హోమోలోగేషన్ ఇంజనీర్ కె. అరవింద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అరవింద్ 28 పేజీల సూసైడ్ నోట్ వ్రాసి, అందులో కంపెనీ యజమాని భవేష్ అగర్వాల్, ఇతర సీనియర్ అధికారులను తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించాడు. అయితే ఓలా మాత్రం మృతుడు ఎప్పుడు కూడా తన సమస్యలను ఎవరితోను చెప్పుకోలేదని, ఫిర్యాదు చేయలేదని తెలిపింది. సెప్టెంబర్ 28న విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఆయన బెంగళూరులోని చిక్కలసంద్రలో నివసిస్తున్నాడు. అరవింద్ మరణించిన తర్వాత అతని సోదరుడు 28 పేజీల సూసైడ్ నోట్ను గుర్తించి పరిశీలించాడు.
వివరాలు
హైకోర్టులో ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తాం: ఓలా
నోట్లో సుబ్రతా కుమార్ దాస్,భవేష్ అగర్వాల్ లాంటి అధికారులు తనపై ఒత్తిడి చేసి మానసికంగా వేధిస్తున్నారని అరవింద్ పేర్కొన్నారు. అలాగే,కంపెనీలో జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, తాము ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. అరవింద్ సోదరుడు అక్టోబర్ 6న భవేష్ అగర్వాల్, మరికొందరి పై ఫిర్యాదు చేశారు. "మా ఉద్యోగి అరవింద్ ఆకస్మిక మరణం వల్ల మేము తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నాము. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి మా సానుభూతిని తెలియజేస్తున్నాం.అరవింద్ గత మూడున్నర సంవత్సరాలుగా కంపెనీలో పనిచేశారు.ఆయన బెంగళూరు ప్రధాన కార్యాలయంలో ఉండేవారు. ఉద్యోగ కాలంలో ఎటువంటి ఫిర్యాదులు ఆయన చేసుకోలేదు.కంపెనీ ఉన్నతాధికారులతో ఆయనకు పరిచయం లేదు" అని కంపెనీ చెబుతోంది. కర్ణాటక హైకోర్టులో ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తామని ఓలా తెలిపింది