NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీలపై నిషేధం విధించిన దిల్లీ ప్రభుత్వం
    తదుపరి వార్తా కథనం
    ఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీలపై నిషేధం విధించిన దిల్లీ ప్రభుత్వం
    ఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీలపై నిషేధం విధించిన దిల్లీ ప్రభుత్వం

    ఓలా, ఉబర్, రాపిడో బైక్ టాక్సీలపై నిషేధం విధించిన దిల్లీ ప్రభుత్వం

    వ్రాసిన వారు Stalin
    Feb 21, 2023
    02:13 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఓలా, ఊబర్, రాపిడో బైక్ టాక్సీ సేవలపై దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బైక్ ట్యాక్సీల నిషేధం విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

    ఓలా, ఉబర్, రాపిడో రైడర్స్ వంటి సర్వీస్ ప్రొవైడర్లు దిల్లీలో బైక్ ట్యాక్సీ సేవలను కొనసాగిస్తే జరిమానా విధిస్తామని దిల్లీ రవాణా శాఖ హెచ్చరించింది. నాన్-ట్రాన్స్‌పోర్ట్ రిజిస్ట్రేషన్ ద్విచక్ర వాహనాలను ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నారని పేర్కొంది.

    వ్యక్తిగత వాహనాలను కమర్షియల్ ట్యాక్సీలుగా ఉపయోగించడం మోటారు వాహన చట్టాన్ని ఉల్లంఘించడమేనని నోటీసుల్లో పేర్కొంది.

    క్యాబ్‌ల ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో ఓలా, ఉబర్, రాపిడో ద్వారా ద్విచక్ర వాహనాలపై ఆధారపడిన అనేక మంది వినియోగదారులపై కూడా ఈ చర్య ప్రభావం చూపుతుంది.

    దిల్లీ ప్రభుత్వం

    బైక్ టాక్సీ సేవలను కొనసాగిస్తే రూ.5,000 జరిమానా

    ఓలా, ఉబర్, ర్యాపిడో రైడర్స్ వంటి సర్వీస్ ప్రొవైడర్లు దిల్లీలో బైక్ టాక్సీ సేవలను కొనసాగిస్తే వాహనానికి రూ.5,000చొప్పున జరిమానా విధిస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండోసారి లేదా ఆ తర్వాత నేరం చేస్తే రూ.10,000 జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధించబడుతుందని హెచ్చరించింది.

    దిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగం ఇప్పటికే ఓలా, ఉబర్, రాపిడోతో అనుబంధించబడిన బైక్‌లను తనిఖీ చేస్తోంది.

    మహారాష్ట్రలో ర్యాపిడో సేవలను సుప్రీంకోర్టు నిషేధించిన తర్వాత దిల్లీ ప్రభుత్వం కూడా ఈ చర్య తీసుకోవడం గమనార్హం. టూవీలర్ క్యాబ్ సర్వీసుల్లో మరో పెద్ద సమస్య ఏమిటంటే ఎమర్జెన్సీ బటన్ కోసం సరైన ఏర్పాట్లు లేవు. దీంతో మహిళా ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    దిల్లీ

    రాయల్ కుటుంబం పేరుతో లగ్జరీ హోటల్‌లో బస, రూ.23లక్షల బిల్లు ఎగ్గొట్టి పరార్ భారతదేశం
    దిల్లీ మహిళా కమిషన్ చీఫ్‌కు వేధింపులు, కారు అద్దంలో చేయి ఇరుక్కున్నా ఈడ్చుకెళ్లిన డ్రైవర్ భారతదేశం
    రిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం గణతంత్ర దినోత్సవం
    విమానంలో మూత్ర విసర్జన కేసు: ఎయిర్ ఇండియాకు రూ.30లక్షల జరిమానా విధించిన డీజీసీఏ ఎయిర్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025