
Air India: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు
ఈ వార్తాకథనం ఏంటి
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం సంచలనంగా మారింది.
ఈ ప్రమాద ఘటనలో రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు మృత్యుంజయుడిగా బయటపడినట్లు గుర్తించారు.
ప్రమాదం జరిగిన క్షణాలకే సీటు నంబర్ 11ఏలో ప్రయాణిస్తున్న ఆ ప్రయాణికుడు ఎమర్జెన్సీ గేటు ద్వారా విమానం వెలుపలికి నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ఈ వివరాలను విచారణ అనంతరం అహ్మదాబాద్ పోలీసులు వెల్లడించారు. విమానం కూలిన అనంతరం ఆయన ఎమర్జెన్సీ గేటు ద్వారా బయటకు వచ్చారని వారు తేల్చారు.
వివరాలు
11ఏ సీటులో రమేష్ విశ్వాస్ కుమార్
ఈ ఘటనపై అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జిఎస్ మాలిక్ స్పందిస్తూ - ''ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఓ ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 11ఏ సీటులో ఉన్న అతని గుర్తింపు నమోదైంది'' అని తెలిపారు.
అయితే, ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్యపై ఇంకా స్పష్టత లేదు. కానీ విమానం జనావాస ప్రాంతంలో కూలిన నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కమిషనర్ మాలిక్ పేర్కొన్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రమాదం నుంచి బయటపడ్డ ఒకే ఒక్క ప్రయాణికుడు
Meet Ramesh Vishwaskumar of Seat 11A This will make you believe in Miracles. He had 0.000001% Chance of Survival, yet he survived. Jaako raakhe Saiyan, Maar Sake na Koye. #planecrash #AirIndia #BJMedical #Ramesh pic.twitter.com/hEivb3Tbgy
— sam (@sam303T) June 12, 2025