
జునాగఢ్: ఆక్రమణల కూల్చవేతలో పోలీసులపై రాళ్ల దాడి; ఒకరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో జరిగిన ఘర్షణల్లో ఒక వ్యక్తి చనిపోయాడు. జునాగఢ్ మున్సిపల్ అధికారులు ఆక్రమణ తొలగింపులో భాగంగా ఒక దర్గాకు కూల్చివేత నోటీసును అందజేశారు. ఇది ఈ హై డ్రామాకు దారితీసింది.
దర్గాకు సంబంధించిన పత్రాలను ఐదు రోజుల్లోగా పత్రాలను సమర్పించాలని జునాగఢ్ మునిసిపల్ కార్పొరేషన్ నోటీసు ఇచ్చింది.
కూల్చివేత నోటీసులు అందుకున్న తర్వాత శుక్రవారం రాత్రి దర్గా చుట్టూ కనీసం 500-600 మంది గుమిగూడి, పోలీసు అధికారులపై రాళ్లు రువ్వారు.
పోలీసు పోస్ట్ను ధ్వంసం చేశారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ దాడిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సహా ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
హింసాత్మక ఘటనలకు సంబంధించి 174 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్
నిరసనకారులు చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్
జునాగఢ్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రవితేజ వాసంశెట్టి ఈ ఘటనపై మాట్లాడారు. మాజేవాడి గేట్ సమీపంలోని మసీదుకు సంబంధించిన పత్రాలను ఐదు రోజుల్లో పత్రాలను సమర్పించాలని జునాగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో 500-600 మంది ప్రజలు మసీదు వద్ద గుమిగూడి నిరసన తెలిపారని, రహదారిని దిగ్బంధించవద్దని పోలీసులు ఒప్పించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు.
అనంతరం పోలీసులపై నిరసనకారులు రాళ్లతో దాడి చేయడంతో వారిని చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేసినట్లు రవితేజ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాళ్లదాడిలో ఒక పౌరుడు మృతి చెందగా, కొంతమంది పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఆయన చెప్పారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాళ్లు రువ్వుతున్న నిరసనకారులు
#WATCH | Stones pelted, cops injured after a mob protest against the anti-encroachment drive in Gujarat's Junagadh last night
— ANI (@ANI) June 17, 2023
(Note: Abusive language) pic.twitter.com/8wRw0YgO3z