MP Magunta: వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా
Magunta Sreenivasulu reddy: ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీకి రాజీనామా చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. బుధవారం ఒంగోలులో మీడియా సమావేశం నిర్వహించి.. ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తాను 33ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే పేరు కాదని, అదోక బ్రాండ్ అన్నారు. తాను తన రాజకీయ ప్రస్థానంలో దాదాపు 11సార్లు చట్టసభలకు పోటీ చేసినట్లు పేర్కొన్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల తాను వైసీపీని వీడుతున్నట్లు మాగుంట శ్రీనివాసులురెడ్డి చెప్పారు. ఒంగోలు ఎంపీగా తన కుమారుడు రాఘవరెడ్డిని నిలపనున్నట్లు శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేసారు. మాగుంటతో కలిపి మొత్తం ఆరుగురు ఎంపీలు వైసీపీని వీడారు.