NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor: భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో.. 80 మంది ఉగ్రవాదులు మృతి..?
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor: భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో.. 80 మంది ఉగ్రవాదులు మృతి..?
    భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో.. 80 మంది ఉగ్రవాదులు మృతి..?

    Operation Sindoor: భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో.. 80 మంది ఉగ్రవాదులు మృతి..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    08:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత సైన్యం నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్' ఫలితాలు మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నాయి.

    చీకటి చాట్లను చీల్చుకొని వెలుగు విరజిమ్మే సూర్యోదయం మాదిరిగా, ఈ ఆపరేషన్‌లో ఏం జరిగింది అన్న విషయం ప్రపంచానికి ఒక్కొక్కటిగా తెలిసికొస్తోంది.

    తాజాగా వచ్చిన సమాచారానికి అనుగుణంగా, ఈ దాడుల్లో ఇప్పటివరకు సుమారు 80 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు తెలుస్తోంది.

    మరణించిన ఉగ్రవాదుల్లో చాలామంది జైషే మహమ్మద్‌కు చెందిన బవహల్పూర్ శిబిరం, అలాగే లష్కరే తొయిబా ఆధీనంలోని మురిద్కే శిబిరాల్లోనే ఉన్నట్లు సమాచారం.

    ఈ రెండు స్థలాల్లో ప్రతి క్యాంపులోను సుమారుగా 25 నుండి 30 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు.

    ఈ దాడుల్లో మురిద్కేలోని మర్కజ్ తొయిబా మదర్సా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.

    వివరాలు 

    తొమ్మిది ఉగ్రవాద శిబిరాల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతి

    ఈ మదర్సాను లష్కరే తొయిబా సంస్థ తన ప్రధాన కార్యాలయంగా ఉపయోగించేది.

    మరోవైపు, బవహల్పూర్‌లో ఉన్న ఉస్మాన్ ఓ అలీ శిబిరం జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలక స్థావరంగా ఉంది.

    ఇది సుమారు 18 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ స్థావరాన్ని భారత దళాలు ఇప్పటికే 2019లో లక్ష్యంగా పెట్టుకోవాలనుకున్నప్పటికీ, ఆ సమయంలో చివరలో దాన్ని వదిలివేశాయి.

    అయితే ఈసారి మాత్రం సైన్యం సంకల్పంతో దానిని పూర్తిగా ధ్వంసం చేసింది.

    ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు మృతిచెందినట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది.

    పాకిస్థాన్‌కు ఈ దాడుల వల్ల కలిగిన నష్టాన్ని భారత ఇంటెలిజెన్స్ విభాగాలు జాగ్రత్తగా విశ్లేషిస్తూ అంచనా వేస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉగ్రవాదులు
    పాకిస్థాన్

    తాజా

    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా
    Ap news: మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు.. ఆయన కుటుంబ సభ్యులపై కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
    Encounter: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..! జమ్ముకశ్మీర్
    Vacation: అడవుల్లో ఏనుగుల్ని సహజంగా తిరుగుతూ చూడాలనుందా? భారతదేశంలో ఈ ఐదు ప్రదేశాలను తప్పక సందర్శించండి! పర్యాటకం

    ఉగ్రవాదులు

    హమాస్ రాకెట్ దాడుల్లో ఇజ్రాయెల్ మేయర్ సహా 22 మంది మృతి  పాలస్తీనా
    Donald Trump: ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులకు బైడెనే నిధులిచ్చారు: ట్రంప్ సంచలన ఆరోపణలు ఇజ్రాయెల్
    హమాస్ మిలిటెంట్లను వెంబడించి కాల్చి చంపిన ఇజ్రాయెల్ పోలీసులు.. వీడియో వైరల్  ఇజ్రాయెల్
    PM Modi : ఉగ్రవాదంపై పోరుకు కొన్ని దేశాలు కలిసి రాకపోవడం బాధాకరం నరేంద్ర మోదీ

    పాకిస్థాన్

    Cyber Attack: పాక్‌ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం భారతదేశం
    Shehbaz Sharif: మేము రాజీపడం.. ఉగ్రవాది తర్వాత భారత్‌కు పాక్ ప్రధాని హెచ్చరిక! ప్రపంచం
    BSF Jawan: పాక్ చెరలో భారత్ జవాన్.. 85 గంటల గడిచినా విడుదల లేదు! ఆర్మీ
    Hanif Abbasi: 130 అణుబాంబులతో భారత్‌పై దాడి చేస్తాం.. పాకిస్థాన్ రైల్వే మంత్రి హెచ్చరిక! భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025