NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Operation Sindoor:  ఉగ్రవాదం నిర్మూలానికి చేపట్టిన ఆపరేషన్ విజయవంతం : త్రివిధ దళాధిపతులు
    తదుపరి వార్తా కథనం
    Operation Sindoor:  ఉగ్రవాదం నిర్మూలానికి చేపట్టిన ఆపరేషన్ విజయవంతం : త్రివిధ దళాధిపతులు
    ఉగ్రవాదం నిర్మూలానికి చేపట్టిన ఆపరేషన్ విజయవంతం : త్రివిధ దళాధిపతులు

    Operation Sindoor:  ఉగ్రవాదం నిర్మూలానికి చేపట్టిన ఆపరేషన్ విజయవంతం : త్రివిధ దళాధిపతులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 12, 2025
    03:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టడం తమ ప్రధాన లక్ష్యమని త్రివిధ దళాధిపతులు స్పష్టం చేశారు.

    ఈ క్రమంలో మే 7న పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఉన్న ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విజయవంతంగా దాడి నిర్వహించిందని వెల్లడించారు.

    ఆ స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ మాత్రం ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తూనే భారత్‌పై దాడులకు పాల్పడుతోందని వారు విమర్శించారు.

    అయితే, అలాంటి దాడులను భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుని దేశ భద్రతను కాపాడిందని పేర్కొన్నారు.

    పీవోకేలో చేపట్టిన ఆపరేషన్ అత్యంత విజయవంతంగా ముగిసిందని.. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు మరింత ఉగ్రవాద నిర్మూలన దిశగా సాగుతాయని త్రివిధ దళాధిపతులు స్పష్టంచేశారు.

    Details

    పాక్ కు చెందిన క్షిపణులను తిప్పికొట్టాం

    పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో (పీవోకే) ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ విజయవంతమైందని సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.

    ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించామని, ఆ దాడుల్లో పాక్‌కు చెందిన అనేక డ్రోన్లు, క్షిపణులను సమర్థవంతంగా తిప్పికొట్టామని పేర్కొన్నారు.

    ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా సైన్యం విజయవంతంగా మిషన్‌ను పూర్తి చేసిందన్నారు.

    ఈ సందర్భంగా ఆర్మీ అధికారుడు ఏకే భారతి మాట్లాడుతూ.. ''పీవోకేలోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మనం యుద్ధం చేశాం. అత్యాధునిక క్షిపణి వ్యతిరేక రక్షణ వ్యవస్థలతో పాక్‌ డ్రోన్లు, క్షిపణులను నేలకూల్చాం.

    స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 'ఆకాశ్‌' మిసైల్‌ వ్యవస్థను సమర్థవంతంగా ఉపయోగించాం.

    Details

    సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదు

    చైనా తయారీ పీఎల్‌-15 క్షిపణిని కూడా తిప్పికొట్టాం. సాధారణ పౌరులకు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.

    ఈ నేపథ్యంలో వైస్‌ అడ్మిరల్‌ ప్రమోద్‌ మాట్లాడుతూ.. 'భారత్‌ వైపు గగనతల దాడులను తక్షణమే గుర్తించి అడ్డుకున్నాం.

    ఎయిర్‌క్రాఫ్ట్‌ కేరియర్లు, ఫ్లీట్‌, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలతో పాటు డ్రోన్లు, హైస్పీడ్‌ మిసైళ్లను సమర్థంగా వినియోగించాం. నౌకాదళ అడ్వాన్స్‌డ్‌ రాడార్లతో పాక్‌ డ్రోన్లను గుర్తించగలిగాం.

    సమగ్ర నిఘాతో అన్ని దాడులను నిరోధించగలిగామని వివరించారు. ఈ ఆపరేషన్‌తో పాక్‌ సైన్యం జోక్యం చేసుకునే ప్రయత్నాలు కూడా విజయవంతంగా తిప్పికొట్టినట్లు అధికారి పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆపరేషన్‌ సిందూర్‌

    తాజా

    Virat Kohli: టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ 5 టాప్ ఇన్నింగ్స్ ఇవే! విరాట్ కోహ్లీ
    Operation Sindoor:  ఉగ్రవాదం నిర్మూలానికి చేపట్టిన ఆపరేషన్ విజయవంతం : త్రివిధ దళాధిపతులు ఆపరేషన్‌ సిందూర్‌
    UK Visa: బ్రిటన్‌ వీసా కఠిన నిబంధనలు.. ఉద్యోగ కలలు కన్న భారతీయులకు షాక్‌! బ్రిటన్
    Flight Operations: ఉద్రిక్తతలు తగ్గుముఖం.. తిరిగి తెరుచుకున్న 32 విమానాశ్రయాలు ఆపరేషన్‌ సిందూర్‌

    ఆపరేషన్‌ సిందూర్‌

    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్'.. 25 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. దుకాణ్ బంద్..వెల్లడించిన సైన్యం భారతదేశం
    Travel Advisory: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. పాకిస్థాన్ లోని తమ పౌరులకు అమెరికా,యుకె, చైనా అడ్వైజరీ అంతర్జాతీయం
    Operation Sindoor: 'ఆపరేషన్ సిందూర్': ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా పలు నగరాలకు సర్వీసులు రద్దు/నిలిపివేత భారతదేశం
    Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. జైషే స్థావరం ఇలా ఉంది.. వీడియో విడుదల చేసిన బీజేపీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025