NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: కుంభమేళాపై విపక్షాల విద్వేషపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ కౌంటర్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: కుంభమేళాపై విపక్షాల విద్వేషపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ కౌంటర్
    కుంభమేళాపై విపక్షాల విద్వేషపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ కౌంటర్

    PM Modi: కుంభమేళాపై విపక్షాల విద్వేషపూరిత వ్యాఖ్యలు.. ప్రధాని మోదీ కౌంటర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 23, 2025
    05:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహాకుంభమేళాను ఎగతాళి చేసిన ప్రతిపక్ష నేతలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

    మత సంప్రదాయాలను అపహాస్యం చేస్తూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారని ఆదివారం ఆయన విమర్శించారు.

    మధ్యప్రదేశ్‌లోని ఛత్తర్‌పూర్‌లో జరిగిన సభలో మోదీ ప్రసంగించారు. భారతదేశ మత వారసత్వాన్ని దెబ్బతీసే 'బానిస మనస్తత్వం' కలిగిన రాజకీయ నాయకులను తీవ్రంగా విమర్శించారు.

    Details

    మతాన్ని అపహాస్యం చేయడమే కొందరి లక్ష్యం 

    ఈ రోజుల్లో మతాన్ని ఎగతాళి చేసే, ప్రజలను విభజించే నాయకుల సమూహం స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

    విదేశీ శక్తులు కూడా ఈ వ్యక్తులకు మద్దతుగా నిలిచి, దేశాన్ని, మతాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాయని మోదీ విమర్శించారు.

    హిందూ విశ్వాసాన్ని ద్వేషించే వ్యక్తులు శతాబ్ధాలుగా ఏదో ఒక దశలో కొనసాగుతూనే ఉన్నారని మోదీ అన్నారు.

    సామాజిక ఐక్యతను దెబ్బతీయడమే వారి అసలు ఉద్దేశమని పేర్కొన్నారు.

    ప్రధాని మోదీ తన ప్రసంగంలో భాగేశ్వర్ ధామ్ ఆధ్యాత్మిక గురువు ధీరేంద్ర శాస్త్రిని ప్రశంసించారు.

    ఆయన ఐక్యతను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కేన్సర్ చికిత్స కోసం మతపరమైన ప్రదేశంలో ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయడాన్ని అభినందించారు.

    భాగేశ్వర్ ధామ్ ఇప్పుడు అవసరమైన వారికి వైద్య సహాయం కూడా అందిస్తోందని మోదీ అన్నారు.

    Details

    కుంభమేళాపై ప్రతిపక్ష నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలివే

    కుంభమేళాపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    త్రివేణి సంగమంలో స్నానం చేస్తే పేదరికం పోతుందా? అంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.

    కుంభమేళాలో తొక్కిసలాటను ప్రస్తావిస్తూ, 'మృత్యు కుంభ్' అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

    సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కుంభమేళాపై ప్రభుత్వాన్ని నిందించగా, ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ గంగానదిలో మృతదేహాలను విసిరేశారని ఆరోపించారు.

    ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కుంభమేళాను వ్యర్థమైనదిగా అభివర్ణించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    నరేంద్ర మోదీ

    National Games: డెహ్రాడూన్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో 38వ నేషనల్‌ గేమ్స్‌ ని ప్రారంభించిన ప్రధాని మోదీ క్రీడలు
    Stampede in Mahakumbh: కుంభమేళాలో తొక్కిసలాట.. ప్రధాని మోదీ నాలుగుసార్లు ఫోన్ చేశారు : యోగి ఆదిత్యనాథ్‌ యోగి ఆదిత్యనాథ్
    PM Modi: ఆమ్‌ఆద్మీపార్టీపై ధ్వమజమెత్తిన మోదీ.. ప్రధాని తాగే నీళ్లలో విషం కలుపుతారా? అరవింద్ కేజ్రీవాల్
    PM Modi: ఇన్నోవేషన్,ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంగా బడ్జెట్ : మోదీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025