LOADING...
High Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం 
High Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం

High Court: చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలొద్దు: ఏపీ హైకోర్టు ఆదేశం 

వ్రాసిన వారు Stalin
Nov 27, 2023
05:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

మద్యం కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఎక్సైజ్ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించిన చంద్రబాబు, కొల్లు రవీంద్ర (Kollu Ravindra) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు(High Court) తీర్పును రిజర్వు చేసింది. దీంతో తీర్పు వచ్చే వరకు చంద్రబాబు, కొల్లు రవీంద్రపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఏపీ హైకోర్టు ఆదేశించింది. 2014-19 మధ్య చంద్రాబాబు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సమయంలో మద్యం ప్రివిలేజ్ ఫీజు మినహాయింపుతో రాష్ట్ర ఖజానాకు రూ.1,500 కోట్లు నష్టం వాటిల్లిందని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఏపీ హైకోర్టులో కీలక ఆదేశాలు

Advertisement