NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rahul Gandhi: వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా గెలవాల్సింది.. కానీ మోదీ వల్లే ఓటమి.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు 
    తదుపరి వార్తా కథనం
    Rahul Gandhi: వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా గెలవాల్సింది.. కానీ మోదీ వల్లే ఓటమి.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు 

    Rahul Gandhi: వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా గెలవాల్సింది.. కానీ మోదీ వల్లే ఓటమి.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 21, 2023
    08:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్‌లోని జలోర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీని పనౌతి (చెడు శకునం) అంటూ ఎద్దేవా చేశారు.

    ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన 2023 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ ను చూడడానికి నరేంద్ర మోదీ స్టేడియంలోకి అడుగుపెట్టగానే గెలిచే మ్యాచ్ కూడాఓడిపోయామని అన్నారు.

    నరేంద్ర మోదీ ఇప్పటివరకు ఇచ్చిన ప్రసంగాలలో వెనుకబడిన తరగతుల (OBCలు)కి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పుకున్నారే తప్ప వారి అభివృద్ధికి ఏమీ చెయ్యలేదని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

    OBCల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వారి అభివృద్ధిని కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.

    Details 

    రాహుల్ క్షమాపణలు చెప్పాలి: రవిశంకర్ ప్రసాద్ 

    నవంబర్ 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మంగళవారం తన మేనిఫెస్టో - 'జన్ ఘోష్ణ పాత్ర'ను విడుదల చేసింది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడవుతాయి.

    అధికారాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర ప్రజల కోసం ఏడు హామీలను ప్రకటించింది.

    పంచాయతీ స్థాయిలో నియామకాలు, కుల గణన కోసం కొత్త పథకాన్ని మేనిఫెస్టో హామీ ఇచ్చింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు.

    రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పై తప్పుడు పదాలను ఎందుకు వాడాల్సివచ్చింది.అసలు ఆయనకు ఏమైందంటూ ప్రశ్నించారు.

    రాహుల్ వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తున్నదని, వీలైనంత త్వరగా ఆయన క్షమాపణలు చెప్పాలని కోరారు.

    Details 

    సోనియా అన్న మాటలతో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది: రవిశంకర్  

    గుజరాత్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ తల్లి సోనియా గాంఘీ ప్రధాని మోదీని 'మౌత్ కా సౌదాగర్' అని పిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

    సోనియా అన్న మాటలతో గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయిందని.. గతం నుంచి నేర్చుకోవాలని ఆయన అన్నారు.

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపై రాహుల్ గాంధీ వాడిన పదం చాలా నీచమైనదన్నారు.

    దేశంలో క్రీడలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ కోరుకునే మార్గం ఇదేనా? అంటూ ప్రశ్నించారు.

    ఒలింపిక్ పోడియం పథకం (TOPS) మోదీ ప్రభుత్వం టార్గెట్ అని అందువల్లే ఆసియా క్రీడలు, ఒలింపిక్స్,పారాలింపిక్స్‌లో మన దేశం అద్భుతమైన విజయాలను సాధించిందని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాహుల్ గాంధీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    రాహుల్ గాంధీ

    అన్ని ఒక్కొక్కటిగా వెనక్కి.. రాహుల్‌కు అధికారిక నివాసంగా పాత బంగ్లానే..! కాంగ్రెస్
    అవిశ్వాస తీర్మానంపై నేడు రాహుల్ గాంధీ కీలక ప్రసంగం.. ఉత్కంఠగా మారనున్న సభాపర్వం  లోక్‌సభ
    No Confidence Motion: మణిపూర్‌లో భారతమాత హత్యకు గురైంది; రాహుల్ గాంధీ ధ్వజం  అవిశ్వాస తీర్మానం
    లోక్‌సభలో అనూహ్య పరిణామం.. రాహుల్ గాంధీ ప్లయింగ్ కిస్ పై కేంద్ర మంత్రి స్మృతి తీవ్ర ఆగ్రహం  స్మృతి ఇరానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025