NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
    పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

    Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 31, 2025
    03:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పేదవాడికి సహాయం చేసినప్పుడు వచ్చే సంతోషం ఏ ఇతర పనిలోనూ ఉండదనిఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

    పింఛన్లు ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని ఆయన తెలిపారు.

    లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి పింఛన్లు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా చెయ్యేరులో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు.

    అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు.

    'మా హామీలను నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను మొత్తాన్ని పెంచాం. పేదవారి కోసం పింఛన్ల కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారు.

    Details

    అధిక ఫించన్లు అందించే ఏకైక రాష్ట్రం ఏపీనే

    ప్రజల ఆదాయం పెంచి అన్ని విధాలుగా వారి సంక్షేమానికి పనిచేస్తున్నాం. అధిక పింఛన్లు అందించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాదే.

    మేము పేదల కోసం ప్రత్యేకంగా పని చేస్తున్న ప్రభుత్వం. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాము. ఉచితంగా మూడు వంటగ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం.

    పేదలకు రోజుకి మూడుసార్లు అన్నం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోంది.

    ప్రభుత్వ యంత్రాంగం పేదల సంక్షేమం కోసం పనిచేయాలి. ప్రతి గ్రామానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నాయకులు వెళ్లాలి. పింఛను పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములైతే అక్కడ సమస్యలు వెలుగులోకి వస్తాయి.

    Details

    మూడు నెలల పాటు ఫించన్ తీసుకొనే సౌలభ్యం

    పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నాము. చేప అందించడం మాత్రమే కాదు, పట్టించుకోవడమూ నేర్పించాలి. భర్త చనిపోతే ఆటోమేటిక్‌గా భార్యకు పింఛను అందించే సౌకర్యాన్ని తీసుకొచ్చామన్నారు.

    అలాగే, మూడునెలల పాటు పింఛను తీసుకునే సౌలభ్యం కల్పించాం.

    భర్త చనిపోతే భార్య అనాథగా మిగలకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు వివరించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రబాబు నాయుడు
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు
    MLC Kavitha: కవిత సంచలన నిర్ణయం..తెలంగాణ జాగృతి నూతన కార్యాలయం ప్రారంభం కల్వకుంట్ల కవిత
    PM Modi: భారత నారీశక్తిని అడ్డుకున్న ఉగ్రవాదులు మట్టిలో కలిశారు: మోదీ నరేంద్ర మోదీ
    Chiranjeevi : చిరంజీవి-అనీల్ రావిపూడి ప్రాజెక్ట్.. షూటింగ్ పై కీలక అప్డేట్ చిరంజీవి

    చంద్రబాబు నాయుడు

    Bill Gates: బిల్ గేట్స్‌తో చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై కీలక చర్చలు బిల్ గేట్స్
    SC Sub Classification: ఎస్సీ వర్గీకరణపై మాట నిలబెట్టుకున్నాం: చంద్రబాబు  భారతదేశం
    AP Govt: 93వేల కుటుంబాలకు లబ్ధి.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆంధ్రప్రదేశ్
    Polavaram Project: పోలవరం ప్రాజెక్టు పర్యటనలో సీఎం.. బాధితుల సమస్యలపై సమీక్షా పోలవరం

    ఆంధ్రప్రదేశ్

    Private Schools: ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా కల్పించే ప్రవేశాలకు రేటింగ్‌ ఆధారంగా ఫీజులు భారతదేశం
    Chandrababu: ముగిసిన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. పునర్విభజన చట్టంలో అమరావతి పేరు.. క్యాబినెట్‌ ఆమోదం భారతదేశం
    AP Liquor Scam: మద్యం కుంభకోణం.. రూ.3,200 కోట్ల దందాపై ఈడీ కేసు నమోదు! వైసీపీ
    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025