
Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
ఈ వార్తాకథనం ఏంటి
పేదవాడికి సహాయం చేసినప్పుడు వచ్చే సంతోషం ఏ ఇతర పనిలోనూ ఉండదనిఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
పింఛన్లు ప్రతి నెలా ఒకటో తేదీన ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని ఆయన తెలిపారు.
లబ్ధిదారులు ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్లి పింఛన్లు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు.
అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు.
'మా హామీలను నిలబెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను మొత్తాన్ని పెంచాం. పేదవారి కోసం పింఛన్ల కార్యక్రమాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారు.
Details
అధిక ఫించన్లు అందించే ఏకైక రాష్ట్రం ఏపీనే
ప్రజల ఆదాయం పెంచి అన్ని విధాలుగా వారి సంక్షేమానికి పనిచేస్తున్నాం. అధిక పింఛన్లు అందించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాదే.
మేము పేదల కోసం ప్రత్యేకంగా పని చేస్తున్న ప్రభుత్వం. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నాము. ఉచితంగా మూడు వంటగ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం.
పేదలకు రోజుకి మూడుసార్లు అన్నం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం కృషి చేస్తోంది.
ప్రభుత్వ యంత్రాంగం పేదల సంక్షేమం కోసం పనిచేయాలి. ప్రతి గ్రామానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నాయకులు వెళ్లాలి. పింఛను పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములైతే అక్కడ సమస్యలు వెలుగులోకి వస్తాయి.
Details
మూడు నెలల పాటు ఫించన్ తీసుకొనే సౌలభ్యం
పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నాము. చేప అందించడం మాత్రమే కాదు, పట్టించుకోవడమూ నేర్పించాలి. భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు పింఛను అందించే సౌకర్యాన్ని తీసుకొచ్చామన్నారు.
అలాగే, మూడునెలల పాటు పింఛను తీసుకునే సౌలభ్యం కల్పించాం.
భర్త చనిపోతే భార్య అనాథగా మిగలకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు వివరించారు.