NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maharashtra Cyber: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. 10లక్షలకు పైగా సైబర్ దాడులు 
    తదుపరి వార్తా కథనం
    Maharashtra Cyber: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. 10లక్షలకు పైగా సైబర్ దాడులు 
    పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. 10లక్షలకు పైగా సైబర్ దాడులు

    Maharashtra Cyber: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. 10లక్షలకు పైగా సైబర్ దాడులు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 02, 2025
    10:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన అనంతరం భారత్‌లో సైబర్ దాడులు భారీగా పెరిగినట్లు మహారాష్ట్ర సైబర్ విభాగం వెల్లడించింది.

    తాజా లెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల డిజిటల్ దాడులు నమోదయ్యాయి.

    ఈ దాడుల వెనుక పాకిస్థాన్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన హ్యాకింగ్ గుంపులు ఉన్నట్లు గుర్తించారు.

    ఏప్రిల్ 22 తర్వాత డిజిటల్ దాడుల తీవ్రత గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు.

    భారతదేశంలోని వివిధ వెబ్‌సైట్లు, అధికారిక పోర్టళ్లు ప్రధాన లక్ష్యంగా మారాయని పేర్కొన్నారు.

    ముఖ్యంగా పశ్చిమాసియా, ఇండోనేషియా, మొరాకో దేశాల హ్యాకర్లు ఈ సైబర్ దాడుల్లో పాల్గొన్నారని వివరించారు.

    వివరాలు 

    పాక్ దౌత్య సంబంధాల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు

    ఏప్రిల్ 22న పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్రవాదులు నిర్వహించిన దారుణ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి విదితమే.

    ఈ హీన చర్య దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను రేకెత్తించింది. ఈ దాడితో భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి.

    దీనితో, పాకిస్థాన్‌తో ఉన్న దౌత్య సంబంధాల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

    సింధూ నదుల ఒప్పందాన్ని తాత్కాలికంగా అమలు నిలిపివేయడంతో పాటు, భారత్‌లో ఉన్న పాకిస్థాన్ పౌరులు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లాలంటూ ఆదేశించింది.

    ఈ చర్యల నేపథ్యంలో పాకిస్థాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వివిధ వేదికలపై విమర్శలు గుప్పిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహారాష్ట్ర

    తాజా

    Jr.NTR: మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. ఆ బయోపిక్‌లో నటించనున్న హీరో!  జూనియర్ ఎన్టీఆర్
    Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్‌లో 10 మంది మృతి మణిపూర్
    Canada: కెనడా మంత్రివర్గంలో భారతీయ మూలాల నేతలకు కీలక పదవులు  కెనడా
    Shubhanshu Shukla: జూన్‌ 8న నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ లాంచ్ కాంప్లెక్స్ నుండి అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా నాసా

    మహారాష్ట్ర

    Train accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 20 మంది మృతి రైలు ప్రమాదం
    Saif AliKhan: ''నిజంగా కత్తి దాడి జరిగిందా, నటిస్తున్నాడా..?'.. సైఫ్ అలీ ఖాన్ ఘటనపై మహారాష్ట్ర మంత్రి అనుమానం.. భారతదేశం
    Guillain Barre Syndrome: పూణేని వణికిస్తున్న కొత్త వ్యాధి.. గులియన్ బారే సిండ్రోమ్.. 59 కేసులు నమోదు  టెక్నాలజీ
    Maharastra: మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025