LOADING...
JEE MAIN: దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది జేఈఈ మెయిన్‌-1కి హాజరు
దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది జేఈఈ మెయిన్‌-1కి హాజరు

JEE MAIN: దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది జేఈఈ మెయిన్‌-1కి హాజరు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 29, 2026
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ 2026 పేపర్‌-1 ఆన్‌లైన్‌ పరీక్షలు బుధవారం పూర్తయాయి. దేశంలోని ఎన్ఐటీల్లో, టాప్‌ ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌లో చేరేందుకు,అలాగే ఐఐటీల్లో అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామినేషన్‌కు అర్హత పొందేందుకు ఈనెల 21, 22, 23, 24, 28 తేదీల్లో పేపర్‌-1 పరీక్షలు నిర్వహించారు. చివరి రోజు ప్రశ్నపత్రాలు మిగిలిన రోజుల పేపర్లతో పోలిస్తే కొంచెం సులభంగా ఉన్నాయని నిపుణులు తెలిపారు. ఈ పేపర్‌-1కు దేశవ్యాప్తంగా దాదాపు 13.50 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

వివరాలు 

95 శాతం మంది హాజరైనట్లు అంచనా

వీరిలో సుమారు 95 శాతం మంది హాజరైనట్లు అంచనా వేసుతున్నారు. గురువారం జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 నిర్వహించనున్నారు. జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) ఇప్పటికే ఫిబ్రవరి 12 వరకు అన్ని పరీక్షల స్కోర్‌లను ప్రకటిస్తామని ప్రకటించింది. అంటే, రాబోయే 3-4 రోజుల్లో ప్రాథమిక కీ, విద్యార్థుల రెస్పాన్స్‌షీట్లు విడుదల చేయనున్నారు. బీ-ఆర్క్‌, బీ-ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశం కోసం పేపర్‌-2 రాయడం అనివార్యం.

Advertisement